News May 7, 2025
BREAKING: కర్రెగుట్ట వద్ద యుద్ధ వాతావరణం

తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. దాదాపు 10వేల మందితో భద్రత బలగాలు మావోయిస్టుల కోసం గుట్ట చుట్టూ వేట కొనసాగిస్తున్నాయి. మావో అగ్ర నేతలు నక్కి ఉన్నారన్న సమాచారంతో కూంబింగ్ చేపట్టారు. 3 రోజులుగా ఆపరేషన్ కగార్ కొనసాగుతుండటంతో కొందరు జవాన్లకు వడదెబ్బ తగలడంతో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తాము చర్చలకు సిద్ధమని మావోలు ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి.
Similar News
News March 22, 2026
ఇండియాలో ఎక్కువ బ్రాంచులు ఉన్న బ్యాంకులు ఇవే

1. SBI- 23,085
2. పంజాబ్ నేషనల్ బ్యాంక్- 10,228
3. కెనరా బ్యాంక్- 9,948
4. HDFC- 9,545
5. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 8,655
6. బ్యాంక్ ఆఫ్ బరోడా- 8,424
7. ICICI- 7,246
8. యాక్సిస్ బ్యాంక్- 5,976
9. ఇండియన్ బ్యాంక్- 5,955 10. బ్యాంక్ ఆఫ్ ఇండియా- 5,375
News March 22, 2026
PSL నుంచి IPLకు శనక

పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) నుంచి శ్రీలంక T20 కెప్టెన్ దసున్ శనక తప్పుకోనున్నట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి. IPLలో RR తరఫున ఆయన ఆడే అవకాశముందని పేర్కొన్నాయి. గాయంతో దూరమైన సామ్ కరన్ను ఆయన రీప్లేస్ చేస్తారని సమాచారం. కాగా శనకను PSL వేలంలో లాహోర్ క్వాలెండర్స్ 2.2కోట్ల(PKR)కు కొనుగోలు చేసింది. ఇక ఆసీస్ ప్లేయర్ మాక్స్వెల్ సహా మరికొంతమంది ఆటగాళ్లు PSL నుంచి తప్పుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి.
News March 22, 2026
కల్తీ పాలు.. 16కు చేరిన మరణాల సంఖ్య

AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరణాల సంఖ్య 16కు చేరింది. నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగేశ్వరావు(72) తాజాగా మృతి చెందారు. కల్తీ పాలు తాగడంతో ఆయన రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు కొండబాబు(64) అనే వ్యక్తి మాత్రమే కోలుకున్నారు. పాలను నిల్వ చేసే ఫ్రీజర్లో ఇథిలీన్ గ్లైకాల్ <<19323083>>కలవడంతోనే<<>> ఈ ఘోరం జరిగిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైన విషయం తెలిసిందే.


