News May 7, 2025
రిచెస్ట్ లీగ్.. అంపైర్స్ మ్యాచ్ ఫీజ్ ఎంతో తెలుసా?

వరల్డ్ రిచెస్ట్ టీ20 లీగ్ ఐపీఎల్లో అంపైర్ల మ్యాచ్ ఫీజ్ ఎంతనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? ప్లేయర్ల స్థాయి(రూ.7.5 లక్షలు)లో కాకపోయినా వారికీ భారీగానే మ్యాచ్ ఫీజ్లు ఉంటాయి. ఒక్కో మ్యాచ్కు ఆన్ఫీల్డ్ అంపైర్కు రూ.3 లక్షలు, ఫోర్త్ అంపైర్కు రూ.2 లక్షలు ఇస్తారు. డొమెస్టిక్ క్రికెట్(రూ.30 వేలు)తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. విపరీతమైన ఒత్తిడి ఉండే ఐపీఎల్ మ్యాచ్ల్లో ఈ మాత్రం ఫీజ్ ఉండడం సముచితమే.
Similar News
News August 13, 2025
మద్యం వినియోగంలో తెలంగాణ టాప్

TG: మద్యం వినియోగంలో రాష్ట్రం దేశంలోనే టాప్లో నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి సగటున ఏడాదికి విదేశీ మద్యం, బీరు కోసం రూ.3,061 ఖర్చు చేస్తున్నట్లు NIPFP స్టడీలో తేలింది. జాతీయ సగటు రూ.486 ఉండటం గమనార్హం. అలాగే రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాల్లో సిగరెట్ల కోసం యావరేజ్గా ఏడాదికి రూ.624 ఖర్చు చేస్తున్నారు. మరోవైపు వార్షిక వ్యక్తిగత వినియోగ ఖర్చులో సిక్కిం (రూ.1,45,261) అగ్రస్థానంలో ఉంది.
News August 13, 2025
రీ పోలింగ్ను బహిష్కరిస్తున్నాం: అవినాశ్

AP: 2 కేంద్రాల్లో రీ పోలింగ్ అంటూ ఎన్నికల కమిషన్ కంటితుడుపు చర్య తీసుకుందని YCP MP అవినాశ్ రెడ్డి విమర్శించారు. తాము 15 చోట్ల కోరితే 2 చోట్ల పోలింగ్ చేపట్టారని, దీన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు. ‘కోర్టుకు ఏదో కారణం చెప్పడానికే రీ పోలింగ్ చేపట్టింది. ఓటర్ స్లిప్పులు లాక్కొని దొంగ ఓట్లు వేశారు. ఇలాంటి ఎన్నిక ఎక్కడా జరిగి ఉండదు. పులివెందులలో బాబు కొత్త సంస్కృతి తీసుకొచ్చారు’ అని ఫైర్ అయ్యారు.
News August 13, 2025
వచ్చే నెల ట్రంప్తో మోదీ భేటీ?

PM మోదీ వచ్చే నెల USలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ(UNGA) సమ్మిట్లో భాగంగా SEP 23 నుంచి జరిగే హైలెవల్ మీటింగ్లో PM పాల్గొంటారని సమాచారం. ఆ సమయంలో US ప్రెసిడెంట్ ట్రంప్ని కలిసి ట్రేడ్ డీల్, టారిఫ్స్పై చర్చించే అవకాశముంది. అలాగే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని కూడా PM కలవొచ్చని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి.