News March 30, 2024

కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్సీ

image

TG: ఇటీవల బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. GHMC మేయర్ విజయలక్ష్మి నేడు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. మరోవైపు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ హస్తం గూటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News March 19, 2026

కవిత కొత్త పార్టీ.. పేరు ఇదే

image

TG: జాగృతి చీఫ్ కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆమె జనవరి 23నే దరఖాస్తు చేశారు. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం త్వరగా పరిశీలించి నిర్ణయం వెలువరించేలా ఆదేశాలివ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే దరఖాస్తులో లోపాలున్నాయని ECI తరఫు న్యాయవాది FEB 27న న్యాయస్థానానికి తెలిపారు. ఈ అంశంపై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది.

News March 19, 2026

BREAKING: భారీగా తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,780 తగ్గి రూ.1,54,640కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.2,550 పతనమై రూ.1,41,750గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 19, 2026

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇంధన కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పరం ప్రతీకార దాడులకు దిగడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ పరిణామాలతో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 112 డాలర్లకు చేరడం భయాలను పెంచింది. సెన్సెక్స్ 1,545 పాయింట్లు కోల్పోయి 75,148 వద్ద.. నిఫ్టీ 467 పాయింట్లు నష్టపోయి 23,313 దగ్గర కొనసాగుతోంది. పవర్ గ్రిడ్, NTPC షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి.