News March 30, 2024
మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి

AP: మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈయన వైసీపీకి రాజీనామా చేసి ఫిబ్రవరిలో జనసేన పార్టీలో చేరారు. పొత్తులో భాగంగా జనసేనకు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లు దక్కాయి. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ పేరును ఇదివరకే ప్రకటించారు. అటు 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పోటీ చేస్తుండగా.. పాలకొండ, అవనిగడ్డ సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
Similar News
News March 25, 2026
ఆముదం మొక్కల కొమ్మల కత్తిరింపుతో లాభాలు(2/2)

మొదటి కొమ్మను కత్తిరించిన వారం తర్వాత రెండవ కొమ్మ, రెండో గెలను ఉంచి మిగిలిన కొమ్మలను తీసివేయాలి. ఇలా విడతల వారీగా 5-6 గెలలను ఉంచి మిగిలినవి తీసివేయాలి. దీని వల్ల అనవసర కొమ్మల పెరుగుదల ఆగి, కణుపుల మధ్య దూరం తగ్గి మొక్క ఎత్తు తగ్గుతుంది. గెల పొడవు, గింజ లావుగా ఉండి తూకం ఎక్కువయ్యే అవకాశం ఉంది. పంట కాలం దాదాపు 40 రోజుల వరకు తగ్గుతుంది. మొక్క ఎత్తు తక్కువగా ఉంటే మందులను సులభంగా పిచికారీ చేయవచ్చు.
News March 25, 2026
అప్పుడు IPL క్రికెటర్.. ఇప్పుడు RCBకి ఛైర్మన్

IPL ఫ్రాంచైజీ RCBని ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్షియం <<19468471>>కొనుగోలు<<>> చేసిన సంగతి తెలిసిందే. RCB కొత్త ఛైర్మన్గా కుమార మంగళం బిర్లా కుమారుడు ఆర్యమాన్ బిర్లా ఎంపికయ్యారు. ఆయన దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించారు. 2018, 2019లో IPLలో RR జట్టు సభ్యుడిగా ఉన్నారు. కానీ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. మానసిక ఆరోగ్య కారణాలతో 2019 చివర్లో ఆయన క్రికెట్కు గుడ్బై చెప్పారు.
News March 25, 2026
ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితి పెంచాలి: నిరుద్యోగ జేఏసీ

AP: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠ వయో పరిమితిని 42 నుంచి 46 ఏళ్లకు పెంచాలని రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ షేక్ సిద్ధిక్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో మ్యాగ్జిమమ్ ఏజ్ లిమిట్ 46 ఏళ్లుగా ఉందని, ఇక్కడ కూడా 46కి పెంచాలని కోరారు. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.


