News March 30, 2024

ఇకపై కాటన్ వస్త్రాల్లో అయోధ్య రాముడు

image

దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి ప్రారంభాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి నుంచి అయోధ్యలో బాల రాముడు కాటన్ వస్త్రాల్లో దర్శనమిస్తారని శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్వీట్ చేసింది. సహజమైన రంగులతో ఈ వస్త్రాలను రూపొందించినట్లు పేర్కొంది.

Similar News

News January 13, 2026

సంక్రాంతికి గాలి పటాలు ఎందుకు ఎగురవేస్తారు?

image

సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగురవేయడం శ్రీరామచంద్రుడి కాలం నుంచి కొనసాగుతోంది. పురాణాల ప్రకారం రాముడు సంక్రాంతి రోజున గాలిపటం ఎగురవేయగా అది ఇంద్రలోకానికి చేరినట్టు చెప్తారు. అప్పటి నుంచి ఇది ఆచారంగా కొనసాగుతోంది. ఇక చైనాలో సైనిక అవసరాల కోసం వీటిని రూపొందించారు. అమెరికా, ఫ్రాన్స్, జపాన్, థాయ్‌లాండ్ వంటి దేశాలలో వేడుకలుగా జరుపుకుంటారు. దీని వలన శరీరానికి, కళ్లకు వ్యాయామం కలుగుతుంది.

News January 13, 2026

జాగ్రత్త.. ఆ వీడియో చూసి స్టాక్స్ కొంటున్నారా?

image

స్టాక్స్ కొనేవారిని BSE అలర్ట్ చేసింది. తమ సీఈవో, ఎండీ సుందర రామమూర్తి కొన్ని కంపెనీల షేర్లు కొనాలని రిఫర్ చేస్తున్నట్లు SMలో చక్కర్లు కొడుతున్న వీడియో డీప్‌ఫేక్ అని వెల్లడించింది. తమ అధికారుల్లో ఎవరికీ స్టాక్ మార్కెట్ టిప్స్ ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి మోసపూరిత, అనధికార వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. SHARE IT.

News January 13, 2026

భోగి పళ్లలో ఏమేం ఉండాలి?

image

భోగి పళ్ల మిశ్రమంలో ప్రధానంగా రేగుపళ్లు ఉండాలి. వీటితో పాటు చిన్న చెరుకు ముక్కలు, శనగలు, చిల్లర నాణాలు, బంతిపూల రేకులు కలపాలి. కొన్ని ప్రాంతాల్లో వీటికి అదనంగా బియ్యం, నల్ల నువ్వులు కలుపుతారు. రేగుపళ్లు సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైనవి. నాణాలు లక్ష్మీదేవికి సంకేతం. ఈ వస్తువులన్నీ కలిపి పిల్లల తలపై పోయడం వల్ల వారిలోని గ్రహ దోషాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని సంప్రదాయం చెబుతోంది.