News March 30, 2024

రింకూ సింగ్‌కు బ్యాట్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్

image

నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి తర్వాత KKR ప్లేయర్లను రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కలిశారు. యువ బ్యాటర్లను అభినందిస్తూ వారికి పలు సూచనలు చేశారు. ఈక్రమంలో డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీతో దిగిన ఫొటోలను KKR ప్లేయర్ రింకూ సింగ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తనకు పలు సూచనలు చేసి స్పెషల్ బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చినందుకు థాంక్స్ అని పేర్కొన్నారు.

Similar News

News April 8, 2026

‘ధురంధర్-2’ సక్సెస్‌పై మౌనం వీడిన దీపిక

image

రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్-2’ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమా గురించి రణ్‌వీర్ భార్య దీపికా పదుకొణె పోస్ట్ పెట్టలేదంటూ SMలో చర్చ మొదలైంది. దీనిపై ఆమె తన స్టైల్‌లో రియాక్ట్ అయ్యారు. ‘మీకంటే ముందే నేను సినిమా చూశా. SMలో పెట్టనంత మాత్రాన సపోర్ట్ చేయనట్లా?’ అని కౌంటర్ ఇచ్చారు. రణ్‌వీర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆమె అనవసర విమర్శలకు ఇలా ఫుల్ స్టాప్ పెట్టారు.

News April 8, 2026

BREAKING: భారీగా పెరిగిన బంగారం ధర

image

ఇరాన్-అమెరికా యుద్ధం నిలిచిపోవడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.3,980 పెరిగి రూ.1,53,820కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.3,650 ఎగబాకి రూ.1,41,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో కాస్త తేడాలుండొచ్చు.

News April 8, 2026

ఈ యుద్ధంలో నిజంగా ఓడింది సామాన్యుడే!

image

సీజ్‌ఫైర్‌ను US, ఇరాన్ రెండూ తమ విజయంగా చెప్పుకొన్నాయి. లక్ష్యాలు నెరవేరాయని ప్రకటించుకున్నాయి. కానీ 38 రోజుల ఈ యుద్ధంలో నిజంగా ఓడింది మాత్రం సామాన్యుడే. చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. వాటి నుంచి బయటపడడానికి ఇంకొన్ని నెలలు పడుతుంది. చాలా దేశాలు ఎకనామిక్ క్రైసిస్‌లో చిక్కుకున్నాయి. పరువు కోసం ఇరాన్, US గెలుపు పాటలు పాడుతున్నా.. ప్రపంచం మాత్రం ఆ భారాన్ని ఇంకా మోయాల్సిందే.