News March 30, 2024
బీజేపీ నుంచి ‘రాయల్’గా బరిలోకి! – 1/2

ఎన్నికల బరిలో నిలవాలనుకునే రాజవంశీయులకు బీజేపీ ఓ మంచి వేదిక అయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈసారి BJP నుంచి 10 మంది లోక్సభ బరిలో ఉండటమే ఇందుకు కారణం. మైసూర్ రాజవంశీయుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ను మైసూర్ అభ్యర్థిగా బీజేపీ ఇటీవల ప్రకటించింది. 20ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ రాయల్ ఫ్యామిలీ మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. 2004లో ఓటమి అనంతరం వీరి కుటుంబం రాజకీయాలకు దూరమైంది.
<<-se>>#Elections2024<<>>
Similar News
News January 27, 2026
భారత్-EU ఒప్పందాలపై ప్రధాని ట్వీట్

ఇండియా- యురోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం ఒక కీలక మైలురాయి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా పెట్టుబడులు & ఉపాధికి కొత్త మార్గాలను తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యూరప్ నేతలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ భాగస్వామ్యం ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని ట్వీట్ చేశారు. ఈ చరిత్రాత్మక అడుగుతో IND-యూరప్ మధ్య సహకారం మరింత పెరగనుంది.
News January 27, 2026
భారత్ భారీ స్కోర్

ఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ 352-8 స్కోర్ చేసింది. విహాన్ సెంచరీ(109*) బాదగా, అభిజ్ఞాన్ కుందు 61, వైభవ్ సూర్యవంశీ 52, ఆరోన్ 23, కెప్టెన్ ఆయుష్ మాత్రే(21), అంబ్రిష్ 21, ఖిలాన్ పటేల్ 30 రన్స్ చేశారు. కాగా గ్రూప్ స్టేజీలో హ్యాట్రిక్ విజయాలతో యంగ్ ఇండియా జోరుమీదున్న విషయం తెలిసిందే.
News January 27, 2026
19 ఇరిగేషన్ ప్రాజెక్టులకు మహర్దశ

AP: ప్రాధాన్యత వారీగా ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిచేయాలని CM ఆదేశించడం తెలిసిందే. ఇందుకు సంబంధించి అధికారులు 19 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. వెలిగొండ, కొరిశపాడు, పాలేరు, మల్లెమడుగు, శ్రీబాలాజీ రిజర్వాయర్ వీటిలో ఉన్నాయి. కుప్పం, మడకశిర బ్రాంచ్ కెనాళ్లు, మూలపల్లి, హంద్రీనీవా, అట్లూరుపాడు, భైరవానితిప్ప, జీడిపల్లి అప్పర్ పెన్నార్, అన్నమయ్య, వేదవతి-గాజుల దిన్నెవంటి ప్రాజెక్టులను ముందు పూర్తి చేస్తారు.


