News March 30, 2024

బీజేపీ నుంచి ‘రాయల్‌’గా బరిలోకి! – 1/2

image

ఎన్నికల బరిలో నిలవాలనుకునే రాజవంశీయులకు బీజేపీ ఓ మంచి వేదిక అయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈసారి BJP నుంచి 10 మంది లోక్‌సభ బరిలో ఉండటమే ఇందుకు కారణం. మైసూర్ రాజవంశీయుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్‌ను మైసూర్ అభ్యర్థిగా బీజేపీ ఇటీవల ప్రకటించింది. 20ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ రాయల్ ఫ్యామిలీ మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. 2004లో ఓటమి అనంతరం వీరి కుటుంబం రాజకీయాలకు దూరమైంది.
<<-se>>#Elections2024<<>>

Similar News

News April 6, 2026

లేఆఫ్స్‌ వద్దు.. రీస్కిల్లింగ్‌పై దృష్టి పెట్టండి: NITES

image

టెక్ కంపెనీలు లేఆఫ్స్‌కు బదులు ఉద్యోగుల స్కిల్స్‌ను పెంచడంపై దృష్టి పెట్టాలని IT ఉద్యోగుల సంఘం ‘నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్’ అభిప్రాయపడింది. లేఆఫ్స్‌ను చివరి ఆప్షన్‌గా చూడాలంది. ప్రైవేట్ సెక్టార్‌లో లే ఆఫ్స్, నోటీస్ పీరియడ్స్, పరిహారాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు లేవని, ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఉద్యోగుల హక్కులను కాపాడాలని సంఘం ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా కోరారు.

News April 6, 2026

ఒక్కరోజే 51 లక్షల సిలిండర్ల విక్రయం: కేంద్రం

image

పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మార్చి 23 నుంచి ఇప్పటివరకు 5 కేజీల సిలిండర్లు 6.6 లక్షలు అమ్ముడైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎలాంటి కొరత లేదని, ఏప్రిల్ 4న ఒక్క రోజే 51 లక్షల గృహ వినియోగ సిలిండర్లు డెలివరీ అయ్యాయని తెలిపింది. మార్చి నుంచి ఇప్పటివరకు అక్రమంగా నిల్వ చేసిన 50వేలకు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

News April 6, 2026

చైనాను మించిన క్రీడా సదుపాయాలు HYDలో ఉండాలి: CM

image

TG: ఒలింపిక్స్ నిర్వహించేలా, చైనాను మించిన క్రీడా సదుపాయాలు HYDలో ఉండాలని రాష్ట్ర స్పోర్ట్స్ హబ్ ప్రతినిధులకు CM రేవంత్ సూచించారు. గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధిపై ఆయన సమీక్షించారు. ‘క్రీడారంగంలో HYDను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలి. జూన్ 2న స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తాం. ఆటగాళ్లు నేరుగా స్టేడియానికి చేరుకునేలా హెలిప్యాడ్‌తో పాటు ప్రపంచ స్థాయి సదుపాయాలు ఏర్పాటు చేయాలి’ అని ఆదేశించారు.