News March 30, 2024
ఫోన్ ట్యాప్ చేయకుండా ఉండాలంటే?
మీ ఫోన్ను ఇతరులు ఆపరేట్ చేస్తున్నారని తెలిసినప్పుడు వెంటనే ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం బెటర్. వెంటనే ఫ్యాక్టరీ రీసెట్ చేసి స్ట్రాంగ్ పాస్వర్డ్ను ఫోన్ లాక్ & యాప్స్కు క్రియేట్ చేయండి. అనుమానాస్పదంగా కనిపించే యాప్స్ను అన్ఇన్స్టాల్ చేయండి. మీ OSను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి. సెక్యూర్డ్ WIFIలో మాత్రమే కనెక్ట్ అవ్వండి. అవసరం లేనప్పుడు బ్లూటూత్ & WIFIని ఆఫ్ చేసి ఉంచండి.
Similar News
News October 5, 2024
అరుదైన రికార్డు ముంగిట హార్దిక్
బంగ్లాతో T20 సిరీస్ ముంగిట భారత పేస్ ఆల్రౌండర్ హార్దిక్ను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇప్పటి వరకు T20ల్లో 86 వికెట్లు తీసిన పాండ్య మరో 5 తీస్తే ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత పేసర్గా నిలుస్తారు. ప్రస్తుతం ఈ రికార్డు భువనేశ్వర్(90) పేరిట ఉంది. మొత్తంగా చూసుకుంటే స్పిన్నర్ చాహల్ 96 వికెట్లతో టాప్లో ఉన్నారు. బుమ్రా 86 వికెట్లు తీసినప్పటికీ అతడు బంగ్లాతో సిరీస్ ఆడటం లేదు.
News October 5, 2024
ఫొటో గ్యాలరీ.. హంసవాహనంపై తిరుమలేశుడు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన ఇవాళ వేంకటేశ్వరుడు హంసవాహనంపై తిరుమల మాడ వీధుల్లో విహరించారు. సరస్వతీమూర్తి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. కనులపండువగా సాగిన మహోత్సవ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.
News October 5, 2024
బంగ్లాతో టీ20 సిరీస్కు తిలక్ వర్మ
టీమ్ ఇండియా ఆల్రౌండర్ శివమ్ దూబే వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన రేపటి నుంచి బంగ్లాదేశ్తో ప్రారంభమయ్యే టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. దూబే స్థానంలో హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. త్వరలోనే తిలక్ జట్టుతో కలుస్తారని తెలుస్తోంది. కాగా రేపు రాత్రి 7.30 గంటలకు గ్వాలియర్లో భారత్, బంగ్లా మధ్య తొలి టీ20 ప్రారంభం కానుంది.