News March 30, 2024
ఫోన్ ట్యాప్ చేయకుండా ఉండాలంటే?
మీ ఫోన్ను ఇతరులు ఆపరేట్ చేస్తున్నారని తెలిసినప్పుడు వెంటనే ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం బెటర్. వెంటనే ఫ్యాక్టరీ రీసెట్ చేసి స్ట్రాంగ్ పాస్వర్డ్ను ఫోన్ లాక్ & యాప్స్కు క్రియేట్ చేయండి. అనుమానాస్పదంగా కనిపించే యాప్స్ను అన్ఇన్స్టాల్ చేయండి. మీ OSను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి. సెక్యూర్డ్ WIFIలో మాత్రమే కనెక్ట్ అవ్వండి. అవసరం లేనప్పుడు బ్లూటూత్ & WIFIని ఆఫ్ చేసి ఉంచండి.
Similar News
News January 22, 2025
రేషన్ కార్డుల అంశంపై ప్రభుత్వం అప్రమత్తం
TG: రేషన్ కార్డుల జారీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. గ్రామ సభల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిపక్షాలు కావాలనే గొడవ చేస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందుతాయన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు.
News January 22, 2025
అభిషేక్ శర్మ 20 బంతుల్లోనే ఫిఫ్టీ
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టీ20లో టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (50*) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నారు. 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 6 సిక్సర్లతో ఆయన అర్ధ శతకం చేశారు. ఆదిల్ రషీద్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 93/2గా ఉంది. టీమ్ ఇండియా విజయానికి ఇంకా 40 పరుగులు కావాల్సి ఉంది.
News January 22, 2025
మహా కుంభమేళాలో ‘ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ ప్రదర్శన
యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందించిన ‘ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ సినిమాను ప్రదర్శించనున్నారు. సెక్టార్ 6లోని దివ్య ప్రేమ్ సేవా శిభిరంలో ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేశారు. తాజాగా విడుదలైన 4K వెర్షన్ను చూసేందుకు పాఠశాల పిల్లలు, భక్తులను ఆహ్వానిస్తున్నారు.