News March 31, 2024
సత్తెనపల్లి గడ్డపై సత్తా చాటేదెవరో?

AP: రాజకీయ చైతన్యం పుష్కలంగా ఉన్న నియోజకవర్గం పల్నాడు(D) సత్తెనపల్లి. ఇక్కడ అభ్యర్థికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య ఇక్కడి నుంచే 2సార్లు ఇండిపెండెంట్గా గెలిచారు. కాంగ్రెస్ 4సార్లు, స్వతంత్రులు 3సార్లు, CPM, TDP 2సార్లు, CPI, YCP ఒక్కోసారి నెగ్గాయి. ఈసారి రాజకీయాల్లో తలపండిన అంబటి రాంబాబు (YCP), కన్నా లక్ష్మీనారాయణ(TDP) ఢీకొంటున్నారు.
#ELECTIONS2024
Similar News
News January 12, 2026
ఎంగేజ్మెంట్ చేసుకున్న శిఖర్ ధవన్

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రేయసి సోఫీతో నిశ్చితార్థం జరిగిన విషయాన్ని ఆయన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు చేతికి రింగ్ ఉన్న ఫొటోను ఆయన షేర్ చేశారు. అంతకుముందు ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషాను 2012లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2023లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
News January 12, 2026
సివిల్ సూట్ వేసినా.. స్టాప్ ఆర్డర్ వస్తేనే ఊరట

‘నల్లమలసాగర్’పై TG పిటిషన్ను కాదని సివిల్ సూట్ వేయాలని SC సూచించింది. అయితే సివిల్ సూట్ వేస్తే AP సహా గోదావరి బేసిన్లోని ఇతర రాష్ట్రాలూ స్పందించాలి. వాటి స్పందనకు ఎంత టైం పడుతుందో తెలియదు. అటు గోదావరి నీటి తరలింపునకు ఫీజిబిలిటీ నివేదికను కేంద్రానికి అందించి DPR టెండర్లకు AP సిద్ధమైంది. ఈ తరుణంలో సివిల్ దావా వేసినా SC స్టాప్ ఆర్డర్ ఇస్తేనే TGకి ఊరట. వరదజలాలే వాడుతున్నట్లు AP వాదిస్తోంది.
News January 12, 2026
పండుగల్లో ఇలా మెరిసిపోండి

* ముల్తానీ మట్టి, రోజ్వాటర్ కలిపి ప్యాక్ సిద్ధం చేసుకోవాలి. ఈ ప్యాక్ని ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇది మీ ముఖానికి చల్లదనంతో పాటు మెరుపునిస్తుంది.
* పుదీనా ఫేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పుదీనా ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ముఖానికి రాసుకోవాలి. ప్యాక్ ఆరిపోయాక చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. దీని వల్ల ముఖం తాజాగా మారుతుంది.


