News March 31, 2024
స్కాలర్షిప్ దరఖాస్తుకు నేడు చివరి తేదీ

TG: SC, ST, BC, PWD విద్యార్థుల ప్రీమెట్రిక్ స్కాలర్షిప్కు దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. 5-10 తరగతులు చదువుతోన్న వారు 2024-25 విద్యాసంవత్సరానికి రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినందున మరో ఛాన్స్ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. స్కాలర్షిప్ రెన్యువల్ చేసుకోవాల్సిన వారికీ ఇదే చివరి అవకాశం.
రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం వెబ్సైట్: https://telanganaepass.cgg.gov.in/
Similar News
News February 9, 2026
టీ20ల్లో చెత్త రికార్డ్

శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ దసున్ శనక చెత్త రికార్డ్ మూటగట్టుకున్నారు. ఇవాళ T20 WCలో ఐర్లాండ్పై డకౌటైన ఆయన టీ20ల్లో అత్యధిక(16) సార్లు సున్నాకే ఔటైన ప్లేయర్గా నిలిచారు. నేడు ఎదుర్కొన్న తొలి బంతినే షార్ట్ థర్డ్ మ్యాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. టీ20Iల్లో ఇతని తర్వాత రువాండ జట్టుకు చెందిన జప్పీ(15), ఐర్లాండ్ కెప్టెన్ స్టెర్లింగ్(14) డకౌట్ అయిన లిస్టులో ఉన్నారు.
News February 8, 2026
పట్టుదలతో సాగిపోవాలి.. GenZ స్టూడెంట్స్తో రాహుల్ గాంధీ

జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదని, పట్టుదలతో ముందుకు సాగిపోవాలని జెన్జీ విద్యార్థులకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సూచించారు. ‘ఇన్సెక్యూరిటీ, కాన్ఫిడెన్స్ తక్కువగా ఉందని ఎక్కువ మంది చెప్పారు. నువ్వు నిజాయతీగా ఉండటమే ముఖ్యం. అనుకున్న దానికంటే ఎక్కువ సామర్థ్యం ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. భారత్ జోడో యాత్రలో ఆ విషయాన్ని తెలుసుకున్నాను’ అని UAEకి చెందిన NRI స్టూడెంట్స్తో ఇంటరాక్షన్లో చెప్పారు.
News February 8, 2026
సంక్రాంతి రేసులో టాలీవుడ్ ‘ఫోర్ పిల్లర్స్’!

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ను టాలీవుడ్కి నాలుగు పిల్లర్లుగా చెబుతుంటారు. వచ్చే సంక్రాంతికి వీరంతా బాక్సాఫీసు వద్ద పోటీ పడేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. చిరు-బాబీ, బాలయ్య-గోపీచంద్ మలినేని, నాగార్జున-కళ్యాణ్ కృష్ణ, వెంకటేశ్-అనిల్ రావిపూడి సినిమాలు పొంగల్ పోరుకు రెడీ అవుతున్నాయి. మరి వీటిలో ఏ పుంజు చివరి వరకు బరిలో ఉంటుంది? ఏది రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.


