News August 12, 2025
మాజీ ఎమ్మెల్యేలు కన్నుమూత

AP: అన్నమయ్య(D) రాజంపేట మాజీ MLA కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి(78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన HYDలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1989లో రాజంపేట నుంచి INC MLAగా గెలిచారు. 1985, 1994, 2009లో పోటీ చేసి ఓడిపోయారు. అటు తిరుపతి(D) శ్రీకాళహస్తి మాజీ MLA తాటిపర్తి చెంచురెడ్డి కూడా తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1988 ఉపఎన్నికలో INC తరఫున MLAగా గెలిచారు.
Similar News
News April 17, 2026
వీగిపోయిన మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు

మహిళా రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగులో పాల్గొన్నారు. అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. 2/3 <<19675689>>మెజార్టీ<<>>(352) లేకపోవడంతో బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు..
News April 17, 2026
‘టాక్సిక్’ స్టోరీ లైన్ చెప్పిన యశ్

ఇండిపెండెన్స్ సమయంలో గోవాలో జరిగే తండ్రీ కొడుకుల రివేంజ్ డ్రామాగా ‘టాక్సిక్’ తెరకెక్కిందని హీరో యశ్ వెల్లడించారు. లాస్ వేగాస్(US)లో జరిగిన CinemaCon వేడుకల్లో 9 నిమిషాల మూవీ ప్రివ్యూను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్యం తర్వాత కొన్నేళ్లపాటు గోవాలో కొనసాగిన పోర్చుగీస్ పాలనలో పాలిటిక్స్, గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది.
News April 17, 2026
హార్ముజ్ ఓపెన్.. చమురు ధరలు క్రాష్

హార్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో చమురు ధరలు భారీగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఐరోపాకు చెందిన బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 10.13 డాలర్లు తగ్గి $89.26కు చేరింది. మరోవైపు USకు చెందిన WTI క్రూడ్ $10.45 తగ్గి $84.24కు, UAEకి చెందిన ముర్బాన్ క్రూడ్ 8 డాలర్లు తగ్గి $93.46కు చేరాయి. యుద్ధంతో ఓ దశలో $150కి చేరుతుందనుకున్న చమురు ధర ఇప్పుడు ఈ స్థాయిలో తగ్గడం ఊరటనిస్తోంది.


