News August 12, 2025

ALERT: రాష్ట్రంలో 3 రోజులు భారీ వర్షాలు

image

AP: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Similar News

News August 12, 2025

ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 5 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ APలోని ఉమ్మడి ప.గో., కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు తదితర జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారముందని పేర్కొంది. అటు TGలోనూ HYD, KNR, MHBD, మహబూబ్ నగర్, NLG తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది.

News August 12, 2025

ఎడతెరిపిలేని వర్షం

image

TG: హైదరాబాద్‌లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. మరో 2 గంటల పాటు వర్షం కొనసాగే ఆస్కారం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. అటు నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, జనగామ, యాదాద్రి జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. మీ ఏరియాలో వెదర్ ఎలా ఉంది.

News August 12, 2025

సర్వం సిద్ధం.. ఉ.7 గంటల నుంచే పోలింగ్

image

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC స్థానాల ఉప ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉ.7 గంటల నుంచి సా.5 వరకు పోలింగ్ జరగనుంది. పులివెందులలో 10,601 మంది ఓటర్ల కొరకు 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలో 24,606 మంది ఓటర్ల కోసం 30 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. రెండు మండలాల్లో 1400 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. నిన్న సాయంత్రమే స్థానికేతరులను గుర్తించి పంపేశారు.