News August 12, 2025
సర్వం సిద్ధం.. ఉ.7 గంటల నుంచే పోలింగ్

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC స్థానాల ఉప ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉ.7 గంటల నుంచి సా.5 వరకు పోలింగ్ జరగనుంది. పులివెందులలో 10,601 మంది ఓటర్ల కొరకు 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలో 24,606 మంది ఓటర్ల కోసం 30 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. రెండు మండలాల్లో 1400 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. నిన్న సాయంత్రమే స్థానికేతరులను గుర్తించి పంపేశారు.
Similar News
News August 12, 2025
అలాంటి రోల్ చేయడం నచ్చలేదు: అనుపమ

‘టిల్లు స్క్వేర్’ మూవీలో నటిస్తున్న సమయంలో తాను కంఫర్ట్గా లేనని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. చాలా కాలం ఆలోచించాకే ఆ సినిమా ఒప్పుకొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ మూవీలో లిల్లీ పాత్ర చేయడం నచ్చలేదని, 100% కాన్ఫిడెన్స్గా కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇండస్ట్రీలో నచ్చని విషయాలు చెబితే ‘యాటిట్యూడ్’ అంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఆమె నటించిన ‘పరదా’ ఈ నెల 22న విడుదల కానుంది.
News August 12, 2025
బండి సంజయ్కి కేటీఆర్ లీగల్ నోటీసు

TG: కేంద్ర మంత్రి బండి సంజయ్కి BRS నేత KTR లీగల్ నోటీసు పంపారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై తన పరువుకు నష్టం కలిగించేలా అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. హైకోర్టు జడ్జిలు, ప్రస్తుత CM, మాజీ సీఎం KCR కూతురు, అల్లుడు సహా వేలాది మంది ఫోన్లను KTR ట్యాప్ చేయించారంటూ సంజయ్ ఆరోపించారని నోటీస్లో మెన్షన్ చేశారు. వారంలోగా క్షమాపణలు చెప్పకపోయినా, మళ్లీ ఆరోపణలు చేసినా లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.
News August 12, 2025
జమ్మలమడుగు ఓటర్లతో టీడీపీ రిగ్గింగ్: YCP

AP: పులివెందుల ZPTC ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. జమ్మలమడుగు నుంచి వచ్చిన స్థానికేతర ఓటర్లు నల్లపురెడ్డి పల్లె గ్రామంలో రిగ్గింగ్కు పాల్పడ్డారని ఆరోపించింది. జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ పొన్నతోట మల్లి ఓటేసేందుకు పోలింగ్ కేంద్రం వద్ద లైనులో నిలబడిన ఫొటోను వైసీపీ ట్వీట్ చేసింది.