News August 12, 2025
త్వరలో భారత్-చైనా విమాన సర్వీసులు పున:ప్రారంభం?

భారత్-చైనా మధ్య సర్వీసులను పున:ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకోవాలని ఎయిర్లైన్స్ సంస్థలకు కేంద్రం సూచించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. SCO సమ్మిట్లో పాల్గొనేందుకు PM మోదీ ఈనెల 31న చైనా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా దీనిపై ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. కరోనా సమయం నుంచి ఫ్లైట్ సర్వీసులు నిలిచిపోయాయి. ఇటీవల ఇరుదేశాల మధ్య మైత్రి చిగురిస్తుండటంతో రాకపోకలు రిస్టోర్ కానున్నట్లు సమాచారం.
Similar News
News August 13, 2025
అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు

APలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. వరద ప్రవాహాలను అంచనా వేసి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇవ్వాలని వర్షాలపై సమీక్షలో ఆదేశించారు. ప్రకాశం బ్యారేజ్కు 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉండటంతో కృష్ణా నదీ పరివాహక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అలాగే కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా గట్లు పటిష్ఠ పర్చాలని తెలిపారు.
News August 13, 2025
పాక్ F16 జెట్ల నష్టంపై US దాటవేత

Op సిందూర్లో F16 జెట్లను పాక్ నష్టపోయిందా అన్న ప్రశ్నను US దాటవేసింది. దీనిని పాక్తోనే చర్చించాలంటూ NDTVకి జవాబిచ్చింది. నిజానికి దాయాది దేశంలోని ఈ జెట్ల టెక్నికల్ ఆపరేషన్స్, రిపేర్లన్నీ US కాంట్రాక్టర్లే చూస్తారు. 24/7 వారు నిఘా ఉంచుతారు. వీటిని ఉపయోగించాలన్నా ఒప్పందం ప్రకారం వారి అనుమతి తీసుకోవాలి. 2019లో బాలాకోట్ ఎయిర్స్ట్రైక్స్ తర్వాత జెట్స్ సురక్షితంగా ఉన్నాయని ఇదే US చెప్పడం గమనార్హం.
News August 13, 2025
ఇండియాలో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు IOA ఆమోదం

2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ బిడ్డింగ్కు భారత ఒలింపిక్ సంఘం(IOA) ఆమోదం తెలిపింది. అవకాశం వస్తే అహ్మదాబాద్ వేదికగా ఈ క్రీడలు నిర్వహించాలని భారత్ యోచిస్తోంది. కాగా బిడ్డింగ్ దాఖలుకు ఆగస్టు 31 వరకు అవకాశం ఉంది. ఇదే సమయంలో నిర్వహణ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు కెనడా తాజాగా ప్రకటించడంతో భారత్కు అవకాశాలు మెరుగుపడ్డాయి.