News August 13, 2025
‘కూలీ’కి రజినీకాంత్ రెమ్యునరేషన్ ఎంతంటే?

సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ మూవీ రేపు విడుదల కానుంది. ఈ సినిమాను రూ.350-రూ.400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రజినీ రూ.150 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. లోకేశ్ కనగరాజ్-రూ.50 కోట్లు, నాగార్జున-రూ.24 కోట్లు, అమిర్ ఖాన్-రూ.20 కోట్లు, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతిహాసన్-రూ.4 కోట్లు, అనిరుధ్-రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్.
Similar News
News April 18, 2026
గ్యాస్ బుకింగ్స్ తగ్గాయి: కేంద్రం

దేశవ్యాప్తంగా LPG గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ తగ్గిందని కేంద్రం తెలిపింది. రోజువారీ బుకింగ్స్ 46-50 లక్షల మధ్య ఉన్నాయని చెప్పింది. సిలిండర్ల సరఫరా కూడా స్థిరంగా కొనసాగుతోందని, ఎక్కడా కొరత లేదని పేర్కొంది. పెట్రోల్, డీజిల్ సప్లై సాధారణంగానే జరుగుతున్నట్లు వెల్లడించింది. కాగా ఇరాన్, US శాంతి ఒప్పందానికి దగ్గరవడం, హార్ముజ్ జలసంధిని తెరవడంతో దేశంలో LPG కష్టాలు తప్పనున్నాయి.
News April 18, 2026
TCS ఘటన ‘కార్పొరేట్ జిహాద్’: మహారాష్ట్ర సీఎం

TCS నాసిక్ క్యాంపస్లో <<19663286>>మత మార్పిడి<<>> వ్యవహారం జిహాద్ లాంటిదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ‘ఈ జిహాద్ను మేం వివిధ రూపాల్లో చూశాం. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ వచ్చాయి. వాటి కంటే ఈ కార్పొరేట్ జిహాద్ ఇంకా తీవ్రమైనది. ఇది ఓ కంపెనీ ఆఫీసులోనే జరిగిందా? లేక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నాం’ అని తెలిపారు.
News April 18, 2026
‘5 రాష్ట్రాలు దాటి వచ్చారా?’.. అల్లు అర్జున్ పిటిషన్పై ఢిల్లీ HC

తన పర్సనాలిటీ రైట్స్ పరిరక్షించాలని అల్లు అర్జున్ వేసిన పిటిషన్పై ఢిల్లీ HC ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఢిల్లీ, TGకి మధ్య 5 రాష్ట్రాలున్నాయి. ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు’ అని జస్టిస్ తుషార్ రావు ప్రశ్నించారు. దీనిపై అల్లు అర్జున్ న్యాయవాది స్పందిస్తూ.. హక్కుల ఉల్లంఘన దేశమంతటా జరుగుతోందని, అందుకే రావాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో బన్నీ వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలని జడ్జి ఆదేశాలిచ్చారు.


