News August 14, 2025
Asia Cup: SKY లేకుండానే భారత జట్టు?

ఆసియా కప్లో పాల్గొనే భారత జట్టును మరో వారంలో ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ జపాన్ పర్యటనకు వెళ్లడం పలు సందేహాలకు తావిస్తోంది. ఆయన జపాన్కు వ్యక్తిగత పనులపై వెళ్లారా? లేదా ఏదైనా గాయానికి చికిత్స తీసుకునేందుకు వెళ్లారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో స్కై లేకుండానే ఆసియా కప్కు BCCI జట్టును ప్రకటిస్తుందనీ వార్తలొస్తున్నాయి.
Similar News
News August 14, 2025
అలాగైతే భారత్పై మరింత టారిఫ్స్: US హెచ్చరిక

భారత్పై టారిఫ్స్ను US మరింత పెంచవచ్చని ఆ దేశ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ హెచ్చరించారు. అలస్కాలో శుక్రవారం జరిగే ట్రంప్-పుతిన్ భేటీ రిజల్ట్పై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించేందుకు రష్యా అంగీకరిస్తే టారిఫ్స్ పెంపు ఉండకపోవచ్చని, లేదంటే సుంకాలు పెంపు తప్పదన్నారు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటోందని ఇప్పటికే INDపై US 25% అదనపు టారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే.
News August 14, 2025
నీటి నిర్వహణపై జిల్లాలకు రేటింగ్: సీఎం

AP: నీటివనరుల సంరక్షణతోనే భూగర్భ జలాలు పెరుగుతాయని CM CBN అన్నారు. సమర్థ నీటి నిర్వహణతో కరవును తరిమేయవచ్చని చెప్పారు. సాగునీటిశాఖలో ఇంజినీరింగ్ వ్యవస్థను రీస్ట్రక్చర్ చేస్తామని తెలిపారు. నీటి నిర్వహణలో సాగునీటి సంఘాల భాగస్వామ్యం ఉండాలని ఆ శాఖ సమీక్షలో CM అన్నారు. నీటి నిర్వహణపై జిల్లాలకు రేటింగ్ ఇస్తామని తెలిపారు. వెలిగొండ, గాలేరు నగరి సుజల స్రవంతిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.
News August 14, 2025
SC తీర్పు ప్రజాస్వామ్య విజయం: మహేశ్ కుమార్

TG: బిహార్లో ఓటర్ల తొలగింపుపై సుప్రీంకోర్టు <<17403517>>తీర్పు<<>> ప్రజాస్వామ్య విజయమని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. LoP రాహుల్ లేవనెత్తిన ఓటు చోరీ ఆరోపణ ఈ తీర్పుతో రుజువైందన్నారు. దీనిపై పార్లమెంట్లో చర్చకు పట్టుబట్టినా కేంద్రం స్పందించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. ఆధార్ లింక్తో ‘ఒక ఓటు-ఒక మనిషి’ విధానం అమలు చేయాలన్న రాహుల్ డిమాండ్పై EC స్పందించాలని డిమాండ్ చేశారు.