News April 1, 2024
ఇంటికే వెళ్లి పింఛన్లు ఇవ్వాలి: సీఎస్కు టీడీపీ వినతి

AP: వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు విధించినందున లబ్ధిదారులకు పెన్షన్లను ఇంటి వద్దే అందించే ఏర్పాట్లు చేయాలని సీఎస్ జవహర్రెడ్డికి టీడీపీ నేతలు వినతి పత్రం అందించారు. పెన్షన్ల పంపిణీని ఈ నెల 5లోగా పూర్తి చేయాలని కోరారు. ఈసీ ఉత్తర్వులను అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో టీడీపీకి చెడ్డపేరు తెచ్చేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
Similar News
News January 28, 2026
మహారాష్ట్రకు చంద్రబాబు, లోకేశ్

AP: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కాసేపట్లో మహారాష్ట్రకు వెళ్లనున్నారు. విమాన ప్రమాదంలో చనిపోయిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అంతకుముందు క్యాబినెట్ భేటీలో అజిత్ పవార్ మృతికి మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకు ఉన్న పరిచయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు.
News January 28, 2026
ప్రముఖ డైరెక్టర్ శంకర్కు మాతృవియోగం

టాలీవుడ్ డైరెక్టర్ ఎన్.శంకర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి సక్కుబాయమ్మ వృద్ధాప్య సంబంధింత సమస్యలతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1997లో ‘ఎన్కౌంటర్’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్కు పరిచయమైన శంకర్.. శ్రీరాములయ్య, భద్రాచలం, జయం మనదేరా, ఆయుధం, జై బోలో తెలంగాణ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించారు. శంకర్ స్వగ్రామం నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చిరుమర్తి.
News January 28, 2026
MLAపై లైంగిక ఆరోపణలు.. విచారణకు జనసేన కమిటీ

AP: రైల్వే కోడూరు జనసేన MLA అరవ శ్రీధర్ తనను <<18975483>>లైంగికంగా<<>> వేధించారని సదరు మహిళ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై జనసేన కమిటీని ఏర్పాటు చేసింది. ‘శ్రీధర్పై వచ్చిన వార్తలపై విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీ నియమించాం. వారంలో శ్రీధర్ కమిటీకి వివరణ ఇవ్వాలి. కమిటీ ఇచ్చే నివేదికను పరిశీలించి నిర్ణయం తీసుకునే వరకు ఆయనను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతున్నాం’ అని పేర్కొంది.


