News August 21, 2025
పక్కనోళ్లపై నీళ్లు పడతాయి.. కాస్త చూసి వెళ్లు బ్రో

వర్షాలు కురుస్తుండటంతో చాలా చోట్ల రోడ్డుపై నీరు నిలిచిపోయింది. అందులో నుంచి వేగంగా వాహనాలు వెళ్లడంతో బైకర్లు, పాదచారులపై ఆ వరద నీరు పడి ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఉదయంపూట ఆఫీసులకు, స్కూళ్లకు, ఇంటర్వ్యూలకు వెళ్లేవారు చాలా మంది ఉంటారు. అలాంటి సమయంలో నీరున్న చోట చూసి నెమ్మదిగా వెళ్లాలని నెటిజన్లు సూచిస్తున్నారు. మీకూ ఇలాంటి ఇబ్బంది ఎదురైందా? SHARE IT
Similar News
News August 22, 2025
10,270 క్లర్క్ ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

IBPS క్లర్క్ పోస్టులకు నిన్నటితో దరఖాస్తు గడువు ముగియగా దాన్ని ఆగస్టు 28 వరకు పొడిగించారు. దేశవ్యాప్తంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో మొత్తం 10,270 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. ఏపీలో 367, తెలంగాణలో 261 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. అప్లై కోసం ఇక్కడ <
>>SHARE IT
News August 22, 2025
అమరావతిలో ఎంత వరద వచ్చినా ఇబ్బంది లేదు: నారాయణ

AP: అమరావతిపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. ‘వెస్ట్ బైపాస్ బ్రిడ్జి కింద వాగు ప్రవాహానికి 25 అడుగుల లోతు ఉండాలి. అది పూర్తిగా మట్టితో నిండిపోవడంతో నీళ్లు వెనక్కి వచ్చాయి. అధికారులు రోడ్డుకు గండికొట్టి నీటిని బయటకు పంపించారు. అమరావతిలో ఎంత వరద వచ్చినా ఇబ్బంది లేకుండా నెదర్లాండ్స్ వాళ్లు డిజైన్ చేశారు. అమరావతిని ఆపాలని చూస్తే ప్రజలే ఛీ కొడతారు’ అని తెలిపారు.
News August 22, 2025
EV కార్ల బ్యాటరీలపై అపోహలు-నిజాలు!

EV కారు బ్యాటరీపై ప్రజల్లో నెలొకన్న సందేహాలను Deloitte 2025 రిపోర్ట్ నివృత్తి చేస్తోంది. ఆ నివేదిక ప్రకారం.. EV కారు కొన్న మూడేళ్లకే లక్షలు పెట్టి బ్యాటరీ మార్చనక్కర్లేదు. వాటికి కనీసం 10-20 ఏళ్ల లైఫ్ ఉంటుంది. TATA మోటార్స్ లైఫ్ టైమ్, OLA 8ఏళ్లు వారంటీ ఇస్తున్నాయి. టెస్లా డేటా ప్రకారం 2లక్షల కి.మీ. డ్రైవ్ చేసినా బ్యాటరీ కెపాసిటీ 80% ఉంటుంది. EV కార్ల ధరలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.