News August 22, 2025
అమరావతిలో ఎంత వరద వచ్చినా ఇబ్బంది లేదు: నారాయణ

AP: అమరావతిపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. ‘వెస్ట్ బైపాస్ బ్రిడ్జి కింద వాగు ప్రవాహానికి 25 అడుగుల లోతు ఉండాలి. అది పూర్తిగా మట్టితో నిండిపోవడంతో నీళ్లు వెనక్కి వచ్చాయి. అధికారులు రోడ్డుకు గండికొట్టి నీటిని బయటకు పంపించారు. అమరావతిలో ఎంత వరద వచ్చినా ఇబ్బంది లేకుండా నెదర్లాండ్స్ వాళ్లు డిజైన్ చేశారు. అమరావతిని ఆపాలని చూస్తే ప్రజలే ఛీ కొడతారు’ అని తెలిపారు.
Similar News
News August 22, 2025
ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో ఇది చట్టం కానుండగా, ఉల్లంఘించిన వారికి మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.కోటి జరిమానా లేదా రెండూ విధించవచ్చు. రూల్స్ ఉల్లంఘించి ప్రకటనలు ఇచ్చే వారికి రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.50లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంది. ఆన్లైన్ గేమింగ్ మోసాలు నివారించేలా కేంద్రం దీనిని తీసుకొచ్చింది.
News August 22, 2025
కొత్త సినిమాలో చిరంజీవి మరో లుక్ చూశారా?

చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా నుంచి మరో లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇవాళ ఉదయం విడుదల చేసిన గ్లింప్స్కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇదే ఉత్సాహంలో సెకండ్ లుక్ను రిలీజ్ చేసింది. ఇందులో కుర్చీలో స్టైల్గా కూర్చున్న చిరు సిగరెట్ తాగుతూ కనిపించారు. ఈ కొత్త పోస్టర్ సైతం అభిమానులను ఆకట్టుకుంటోంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
News August 22, 2025
సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు

TG: కూకట్పల్లిలో సహస్ర మర్డర్ <<17484838>>కేసులో<<>> సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లోకి ప్రవేశించిన బాలుడు చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. అది సహస్ర చూడగా వెంట తెచ్చుకున్న కత్తితో 21 సార్లు పొడిచి చంపాడు. చోరీ ఎలా చేయాలి, ఎవరైనా చూస్తే ఏం చేయాలి అని పేపర్లో ముందే రాసుకున్నాడు. స్థానికుడైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సమాచారంతో పోలీసులు బాలుడిని ప్రశ్నించగా విషయం బయటపడింది. లెటర్, కత్తి స్వాధీనం చేసుకున్నారు.