News August 23, 2025

ధర్మస్థల: శవాలు పూడ్చానన్న వ్యక్తి అరెస్టు

image

కర్ణాటకలోని ధర్మస్థలలో వందలాది మంది మహిళల మృతదేహాలను పూడ్చానని చెప్పిన మాజీ శానిటరీ వర్కర్‌ను సిట్ అరెస్ట్ చేసింది. అతడు చెప్పినవన్నీ అబద్ధాలేనని తేల్చి అదుపులోకి తీసుకుంది. 1995-2014 వరకు మహిళల శవాలను పూడ్చానని అతడు ఫిర్యాదు చేయడంతో నేత్రావతి నది ఒడ్డున గత కొన్ని రోజులుగా సిట్ తవ్వకాలు జరిపింది. కానీ ఎలాంటి అవశేషాలు లభించలేదు. తన భర్తతో కొందరు అబద్ధాలాడిస్తున్నారని అతడి భార్య మీడియాకు చెప్పింది.

Similar News

News April 10, 2026

ఒకే రోజు రూ.2,950కోట్లు రిలీజ్.. అకౌంట్లలోకి డబ్బులు: TDP

image

AP: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ చేసిన దుర్మార్గం నుంచి కూటమి ప్రభుత్వం బయట పడేస్తోందని TDP తెలిపింది. CM ఆదేశాలతో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకే రోజు రూ.2,950CR విడుదల చేసినట్లు వివరించింది. పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు ప్రారంభమైనట్లు చెప్పింది. అటు సర్వీస్‌లో ఉన్న పోలీసుల సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులూ మొదలైనట్లు ఓ అకౌంట్లో డబ్బులు పడిన ఫొటోను ట్వీట్ చేసింది.

News April 10, 2026

ఇంట్లో నోట్ల కట్టలు.. జస్టిస్ వర్మ రాజీనామా

image

అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తన రిజైన్ లెటర్‌ను పంపారు. గతేడాది ఢిల్లీలోని జస్టిస్ వర్మ నివాసంలో భారీగా <<17379382>>డబ్బు కట్టలు<<>> బయట పడిన విషయం తెలిసిందే.

News April 10, 2026

మోదీ హత్యకు కుట్ర.. ముగ్గురి అరెస్ట్

image

ప్రధాని మోదీ హత్యకు కుట్ర చేశారనే ఆరోపణలతో బిహార్ పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. తాను మోదీని 22 రోజుల్లో హతమారుస్తానని, భారీగా డబ్బు ఇవ్వాలంటూ అమెరికా నిఘా సంస్థ CIAకు అమన్ తివారీ ఈమెయిల్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు బక్సర్ జిల్లాలో అతడిని అదుపులోకి తీసుకొని మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అతని ఇద్దరు అనుచరులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.