News August 23, 2025
సాఫ్ట్ డ్రింక్స్ బ్యాన్ చేస్తాం.. USకు LPU ఫౌండర్ వార్నింగ్

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) ఫౌండర్ అశోక్ కుమార్ మిట్టల్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. భారత్పై 50% టారిఫ్స్ను ఆగస్టు 27లోగా వెనక్కి తీసుకోకపోతే చండీగఢ్లోని తమ క్యాంపస్లో అమెరికా సాఫ్ట్ డ్రింక్స్, బేవరేజ్ కంపెనీలను బ్యాన్ చేస్తామని హెచ్చరించారు. తమ యూనివర్సిటీలో 40వేల మంది విద్యార్థులు ఉన్నారని, దేశంలోని అతిపెద్ద వర్సిటీల్లో ఒకటని పేర్కొన్నారు.
Similar News
News August 23, 2025
రేపు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు: APSDMA

AP: రాష్ట్రంలోని పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. వాయవ్య బంగాళాఖాతంలో ఆగస్టు25 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
News August 23, 2025
అర్చకులు, ఈవోలకు పదోన్నతులు

TG: దేవదాయ శాఖలో పెండింగ్లో ఉన్న ఆలయాల అర్చకులు, ఈవోలకు పదోన్నతులు లభించాయి. పదోన్నతి పొందిన అర్చకులు, ఈవోలకు మంత్రి కొండా సురేఖ ఆర్డర్ కాపీలను సచివాలయంలో అందజేశారు. దేవదాయ శాఖలో పదవీ విరమణ చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.4లక్షల నుంచి రూ.8లక్షలకు పెంచడానికి, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు మంత్రి సురేఖ కృషి చేశారని అర్చకుల సంఘం ప్రతినిధులు తెలిపారు.
News August 23, 2025
అఖిల్ ఒక్క రూపాయి తీసుకోలేదు: అనిల్ సుంకర

తనకు కష్టం వస్తే తాను వర్క్ చేసిన హీరోలంతా సపోర్ట్గా నిలుస్తారని నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. మూవీస్ ఆడకపోతే తన హీరోలు ఎంతో మద్దతుగా నిలుస్తారని చెప్పుకొచ్చారు. భోళా శంకర్ మూవీ విషయంలో చిరంజీవి చాలా సహాయం చేశారని చెప్పారు. అలాగే, ఏజెంట్ మూవీకి అఖిల్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని వెల్లడించారు. 2023లో 4 నెలల గ్యాప్లో విడుదలైన ఈ 2 చిత్రాలు ఆశించిన ఫలితాలను అందుకోలేదు.