News April 2, 2024

కశ్మీర్ లోయ ఓట్లు ఎవరికో? – 2/3

image

ఇక శ్రీనగర్‌లో ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ మూడు నియోజకవర్గాలు నేషనల్ కాన్ఫరెన్స్ గుప్పిట్లో ఉన్నాయి. ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని ఈ పార్టీ మరోసారి ఇక్కడ గెలవాలని భావిస్తోంది. ఇండియా కూటమిలో NC, PDP భాగమైనా.. సీట్ల పంపిణీకి NC ససేమిరా అంటోంది. అనంతనాగ్ సీటు పీడీపీకి కేటాయించాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించి ఒంటరి పోరుకు సిద్ధమైంది.
<<-se>>#Elections2024<<>>

Similar News

News April 9, 2026

సైంధవుడిలా అడ్డుకోవడమంటే?

image

ఎవరైనా ఓ పనిని ముందుకు సాగనీయకపోతే సైంధవుడిలా అడ్డుకున్నాడని అంటాం. దుర్యోధనుడి సోదరి దుస్సల భర్తే సైంధవుడు(జయద్రథుడు). వనవాసంలో ద్రౌపదిని అతను అవమానిస్తే భీముడు చావగొడతారు. ఆ పగతో తపస్సు చేసి ఒక్కరోజైనా పాండవులను అడ్డగించేలా శివుడిని వరం కోరతారు. అర్జునుడిని మినహాయించి ఈశ్వరుడు ఈ వరమిస్తారు. యుద్ధంలో పద్మవ్యూహంలోకి అభిమన్యుడు వెళ్లాక ఇతర పాండవులు అనుసరించకుండా సైంధవుడు అడ్డుపడతారు.
<<-se>>#EPICSAYINGS<<>>

News April 9, 2026

మావిగన్ జోకర్‌గా జగన్: షర్మిల

image

AP: YCP చీఫ్ <<19603764>>జగన్<<>> YSR పేరును వాడుకున్నారే తప్ప ఆయన ఆశయాలకు వారసులు కాలేదని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. ‘‘దేశంలో క్రిస్టియన్ మైనారిటీలపై దాడులు జరుగుతుంటే YSR వారసుడుగా జగన్ ఎందుకు ఖండించలేదు? 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్‌లు కట్టుకున్నారు. ఇప్పుడు ‘మావిగన్ జోకర్’గా మిగిలారు. మద్యపాన నిషేధమని మాట ఇచ్చి, కల్తీ మద్యం అమ్మి ‘ఓన్లీ క్యాష్’ మాఫియా ఎందుకు చేశారు’’ అని నిలదీశారు.

News April 9, 2026

సీజ్‌ఫైర్‌పై గందరగోళానికి పాకిస్థానే కారణమా?

image

పశ్చిమాసియాలో సీజ్‌ఫైర్‌పై నెలకొన్న గందరగోళానికి పాకిస్థానే కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీజ్‌ఫైర్ అనౌన్స్ చేసేటప్పుడు ఇది లెబనాన్‌కూ వర్తిస్తుందని పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ పేర్కొన్నారు. కానీ ఇది లెబనాన్‌కు వర్తించదని US, ఇజ్రాయెల్ వాదిస్తున్నాయి. మరోవైపు చర్చలు కొనసాగాలంటే లెబనాన్‌పై దాడులు ఆపాల్సిందేనని ఇరాన్ పట్టుబడుతోంది. దీంతో పాక్ సరిగ్గా సమన్వయం చేయలేదా అనే ప్రశ్న ఎదురవుతోంది.