News April 2, 2024

కశ్మీర్ లోయ ఓట్లు ఎవరికో? – 2/3

image

ఇక శ్రీనగర్‌లో ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ మూడు నియోజకవర్గాలు నేషనల్ కాన్ఫరెన్స్ గుప్పిట్లో ఉన్నాయి. ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని ఈ పార్టీ మరోసారి ఇక్కడ గెలవాలని భావిస్తోంది. ఇండియా కూటమిలో NC, PDP భాగమైనా.. సీట్ల పంపిణీకి NC ససేమిరా అంటోంది. అనంతనాగ్ సీటు పీడీపీకి కేటాయించాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించి ఒంటరి పోరుకు సిద్ధమైంది.
<<-se>>#Elections2024<<>>

Similar News

News April 22, 2025

హిరోషిమాలో అణుబాంబు మృతులకు CM రేవంత్ నివాళులు

image

తెలంగాణ CM రేవంత్ జపాన్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయన ఇవాళ హిరోషిమా పీస్ మెమోరియల్ పార్కును సందర్శించి అణుబాంబు మృతులకు నివాళులు అర్పించారు. అలాగే, దాడి జరిగిన ప్రాంతంలో శాంతికి చిహ్నంగా ఏర్పాటు చేసిన డోమ్‌ను సైతం సందర్శించారు. CMతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, జపాన్ ప్రతినిధులు ఉన్నారు. 1945లో 2వ ప్రపంచ యుద్ధం వేళ జపాన్‌పై US అణుబాంబుతో దాడి చేసిన విషయం తెలిసిందే.

News April 22, 2025

CSKకు గెలవాలనే కసి లేదు: రైనా

image

ఐపీఎల్ 2025లో సీఎస్కేకు గెలవాలనే తపన, కసి లేవని ఆ జట్టు మాజీ ప్లేయర్ సురేశ్ రైనా అన్నారు. ప్రస్తుతం అన్ని జట్లకన్నా సీఎస్కేనే బలహీనంగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘జట్టులోని ఆటగాళ్లకు అసలు అంకితభావం, చిత్తశుద్ధి లేనట్లుగా కనిపిస్తోంది. ఇది నేను వారిని అవమానిస్తున్నట్లు కాదు. గతంలో సీఎస్కేకు ఉండే బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు కనిపించడం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News April 22, 2025

తప్పు చేసినవారిపై చర్యలు తప్పవు: సీఎం సిద్దరామయ్య

image

కర్ణాటకలో ‘వింగ్ కమాండర్‌పై దాడి’ కేసులో దోషులపై చట్టప్రకారం చర్యలు తప్పవని ఆ రాష్ట్ర CM సిద్దరామయ్య స్పష్టం చేశారు. ‘కన్నడిగులు మాతృభాష పట్ల గర్విస్తారు. అలా అని ఇతర భాషల్ని ద్వేషించరు. దాడులు చేయరు. మాది అంతటి కుంచిత మనస్తత్వం కాదు. జాతీయ మీడియా మా గౌరవాన్ని దిగజార్చేలా వార్తలు వ్యాప్తి చేయడం దురదృష్టకరం. ఘటనపై సమగ్ర విచారణ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని పోలీసుల్ని ఆదేశించాను’ అని తెలిపారు.

error: Content is protected !!