News April 2, 2024

రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

image

AP: రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ‘ఎన్నికలకు ముందు పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. పింఛన్ల పంపిణీని సీఎం జగన్ సరిగా నిర్వర్తించటం లేదు. దీంతో రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పెన్షన్ అందించాలి. ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

Similar News

News January 21, 2026

సింగరేణి బాధ్యత కేంద్రం తీసుకుంటుంది: కిషన్‌రెడ్డి

image

తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తే సింగరేణి నిర్వహణ బాధ్యత కేంద్రం తీసుకుంటుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మంత్రుల మధ్య వాటాల గొడవతోనే సింగరేణి వివాదం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్‌కు లేఖ రాస్తానని పేర్కొన్నారు.

News January 21, 2026

వేప పిండి, పిడకల ఎరువుతో ప్రయోజనాలు

image

ఒక టన్ను వేప పిండిని దుక్కిలో(లేదా) పంట పెట్టిన తర్వాత వేస్తే 52 నుంచి 55KGల నత్రజని, 10KGల భాస్వరం, 14-15KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. బాగా పొడిచేసిన పిడకల ఎరువు(36-40 బస్తాలు)ను సాగు భూమిలో వేస్తే 5-15KGల నత్రజని, 3-9KGల భాస్వరం, 5-19KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. వేపపిండిలోని పోషకాల శాతం భూమికి అదనపు బలాన్నిచ్చి, చీడపీడలు, తెగుళ్ల ముప్పును తగ్గిస్తుంది.

News January 21, 2026

సమయం అనుకూలించనప్పుడు చేయాల్సిన పనులు

image

కాలం కలిసి రానప్పుడు పాటించే కొన్ని ఆధ్యాత్మిక నియమాలు మనలో మార్పులు తెస్తాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటారు. బయటకు వెళ్లేటప్పుడు నుదుట కుంకుమ, విభూతి ధరిస్తే దృష్టి దోషాలు తొలగి శుభం కలుగుతుంది. శుక్రవారం లక్ష్మీ గణపతిని ఎర్రని పూలతో పూజిస్తే అభివృద్ధి లభిస్తుంది. నిద్రించే ముందు గురు చరిత్ర పారాయణం చేయడం, ఉదయాన్నే అరచేతిని దర్శించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.