News April 3, 2024

కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ లీగల్ నోటీసులు

image

TG: మంత్రి కొండా సురేఖతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని సురేఖతో పాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు. తనకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆయన ఇప్పటికే కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Similar News

News January 16, 2026

YTలో పిల్లల స్క్రీన్ టైమ్‌ను నియంత్రించవచ్చు!

image

పిల్లల స్క్రీన్ టైమ్‌ను నియంత్రించేందుకు యూట్యూబ్ ‘పేరెంటల్ కంట్రోల్స్’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా పిల్లలు యూట్యూబ్ వీడియోలు చూడకుండా పూర్తిగా బ్లాక్ చేయడం లేదా టైమ్ ఫిక్స్ చేయడం వంటివి చేయవచ్చు. ఈ వీడియోలకు పిల్లలు బానిసలుగా మారుతున్నారన్న ఆందోళనల నేపథ్యంలో యూట్యూబ్ ఈ మార్పులు తీసుకొచ్చింది. దీంతోపాటు కిడ్స్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసేలా సైన్-అప్ ప్రక్రియను ఈజీ చేసింది.

News January 16, 2026

రక్షణ రంగంలోకి భారీగా FDIలకు అవకాశం!

image

జియో పాలిటిక్స్, పాక్ నుంచి ఉగ్రవాదం నేపథ్యంలో రక్షణ రంగంలోకి భారీగా FDIలకు అవకాశమివ్వాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం అనుమతులతో అవసరం లేని ఆటోమేటిక్ లైసెన్సింగ్ విధానంలో 49% వరకు FDIలకు అవకాశం ఉంది. దీన్ని 74% పెంచనుందని ‘రాయిటర్స్’ పేర్కొంది. భారత భాగస్వామి కంపెనీల్లో విదేశీ రక్షణ సంస్థలకు మెజార్టీ వాటాకు అవకాశం కల్పించనుంది. ఆధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడమే దీని లక్ష్యమని తెలిపింది.

News January 16, 2026

మేడారం జాతర.. 3 రోజులు సెలవులకు డిమాండ్

image

TG: మేడారం జాతరకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులు అధికారికంగా సెలవులు ప్రకటించాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది. 4 రోజుల పాటు జరిగే ఈ గిరిజన జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని పేర్కొంది. ఈ జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. కాగా జనవరి 28 నుంచి 31 వరకు మేడారంలో అత్యంత వైభవంగా జాతర జరగనుంది.