News April 3, 2024

కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ లీగల్ నోటీసులు

image

TG: మంత్రి కొండా సురేఖతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని సురేఖతో పాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు. తనకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆయన ఇప్పటికే కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Similar News

News April 20, 2025

ధోనీ పరిస్థితులను తలకిందులు చేయగలడు: రోహిత్

image

ధోనీ సామర్థ్యం, అనుభవాన్ని రోహిత్ కొనియాడారు. ధోనీతో అంత ఈజీ కాదని చెప్పారు. ‘మహీ ఎన్నో మ్యాచులకు కెప్టెన్‌గా చేశారు. ఎన్నో ట్రోఫీస్ గెలిపించారు. అలాంటి వ్యక్తి ప్రత్యర్థిగా ఉంటే మనం రిలాక్స్ అవ్వకూడదు. మనం వారిపై ఆధిక్యంలో ఉన్నా.. ఒక సడెన్ మూవ్‌తో మనల్ని ప్రెజర్‌లోకి నెట్టగలడు. ధోనీ ఉంటే.. బ్యాటింగ్ అయినా, ఫీల్డింగ్ అయినా కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు.

News April 20, 2025

డ్రగ్స్ నిర్మూలనకు పాటుపడదాం: చిరంజీవి

image

TG: రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు అందరూ పాటుపడాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని టీవర్క్స్‌లో జరిగిన నోటి క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం అందరం చేయిచేయీ కలుపుదాం. డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా శ్రమించాలి. వ్యసనాలకు బానిసలై తమ కలలను దూరం చేసుకుంటున్న యువతను రక్షిద్దాం’ అని ఆయన పేర్కొన్నారు.

News April 20, 2025

BIG BREAKING: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

image

AP: రాష్ట్రంలో 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. నేటి నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అప్లికేషన్ చేసుకోవాల్సిన సైట్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

error: Content is protected !!