News April 4, 2024

డేంజర్ జోన్‌లో పంత్!

image

KKRతో మ్యాచ్‌లో DC స్లో ఓవర్ రేటు మెయింటేన్ చేయడంతో BCCI మరోసారి జరిమానా విధించింది. CSKతో మ్యాచులోనూ DC ఇదే తప్పు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు రూ.12 లక్షలు ఫైన్ వేయగా.. రెండోసారి అదే తప్పు చేసినందుకు పంత్‌కు రూ.24 లక్షల జరిమానా వేసింది. ఇంపాక్ట్ ప్లేయర్‌‌ సహా ఢిల్లీ ఆటగాళ్లందరికీ రూ.6 లక్షల జరిమానా పడింది. మరోసారి ఇదే జరిగితే పంత్‌కి రూ.30 లక్షల ఫైన్‌తో పాటు ఒక మ్యాచ్‌ నిషేధిస్తారు.

Similar News

News March 20, 2026

మెడికల్ పీజీ సీట్ల భర్తీ.. సుప్రీంకోర్టుకు కాలేజీలు

image

AP, TGలో ఖాళీగా ఉన్న మెడికల్ సీట్ల భర్తీపై కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. FEB 28తో కౌన్సెలింగ్ ముగియగా ఏపీలో 246, టీజీలో 377 పీజీ సీట్లు భర్తీ కాలేదని తెలిపాయి. కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నప్పటికీ కౌన్సెలింగ్‌ గడువును పొడిగించలేదన్నాయి. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.

News March 20, 2026

పాక్-అఫ్గాన్.. సోదరుల్లా ఉండండి: ఖమేనీ

image

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సోదరుల్లా ఉండాలి. మంచి సంబంధాలు ఏర్పర్చుకోండి. ముస్లింల మధ్య విభేదాలు రాకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అని ఖమేనీ చెప్పినట్లు తెలుస్తోంది.

News March 20, 2026

టెన్త్ పరీక్షల రద్దుపై క్లారిటీ

image

తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దవుతాయనే ప్రచారంపై విద్యా కమిషన్ OSD డా.జీనత్ క్లారిటీ ఇచ్చారు. ఇంతవరకు పదోతరగతి బోర్డు ఎగ్జామ్స్ రద్దు చేయమని ఎక్కడా సిఫార్సు చేయలేదని స్పష్టం చేశారు. కేవలం 11వ తరగతి (ఇంటర్ ఫస్టియర్) పబ్లిక్ పరీక్షల రద్దుకే ప్రతిపాదన చేసినట్లు పేర్కొన్నారు. SSC బోర్డు, ఇంటర్ బోర్డు (BIE) విలీనానికి కమిషన్ సిఫార్సు చేసిందని తెలిపారు. తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని కోరారు.