News April 5, 2024
‘పుష్ప-2’ నుంచి బిగ్ అప్డేట్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న బర్త్ డే సందర్భంగా ‘పుష్ప-2’ టీమ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. సినిమాలోని ఆమె లుక్ను రివీల్ చేసింది. ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిని గ్లామర్లెస్గా చూపించారని, ‘పుష్ప-2’లో బ్యూటిఫుల్గా చూపించారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది.
Similar News
News April 23, 2025
FY26లో 2-4% పెరగనున్న సిమెంట్ ధరలు!

దేశీయంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ డిమాండ్ 6.5-7.5% పెరగొచ్చని CRISIL అంచనా వేసింది. రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే అంచనాలతో గ్రామీణ ప్రాంతాల్లో గృహాల నిర్మాణం ఊపందుకుంటుందని తెలిపింది. అలాగే మౌలిక సదుపాయాల వ్యయం పెరగడంతో సిమెంట్ డిమాండ్ అధికమవుతుందని వెల్లడించింది. మొత్తం డిమాండ్లో 12 రాష్ట్రాల వాటా 63-65 శాతం ఉండొచ్చని వివరించింది. దీనివల్ల సిమెంట్ ధరలు 2-4% పెరగొచ్చని పేర్కొంది.
News April 23, 2025
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై కోర్టుకెక్కనున్న మాజీ కోచ్

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జాసెన్ గిలెస్పీ పాకిస్థాన్ జట్టుకు గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు కోచ్గా పనిచేశారు. తనకు ఇవ్వాల్సిన జీతాన్ని పాకిస్థాన్ బకాయి పెట్టిందని ఆయన తాజాగా ఆరోపించారు. దానిపై కోర్టును ఆశ్రయించనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన కాంట్రాక్టును ఉల్లంఘించి నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధాంతరంగా పదవి నుంచి తప్పుకొన్నారని, తామేమీ బకాయిపడలేదని పీసీబీ తెలిపింది.
News April 23, 2025
ఉగ్రదాడి.. విశాఖ వాసి గల్లంతు?

AP: జమ్మూకశ్మీర్ పహల్గామ్లోని బైసరీన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో విశాఖ వాసి గల్లంతైనట్లు సమాచారం. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి ఇటీవల అక్కడికి టూర్ వెళ్లారు. అయితే దాడి తర్వాత ఆయనకు బంధువులు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. దీంతో చంద్రమౌళి భార్య పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన ఆచూకీ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.