News April 5, 2024

దద్దమ్మలు రాజ్యం ఏలుతున్నారు: KCR

image

తెలంగాణలో 2014కు ముందు పరిస్థితులు కనిపిస్తున్నాయని కేసీఆర్ అన్నారు. ‘మేం కరీంనగర్ జిల్లాకు నాలుగైదు జలధారలు సృష్టించాం. అవి ఇప్పుడు ఎండిపోయాయి. గోదావరి ఎడారిగా మారింది. కాంగ్రెస్ సర్కారు చేతగానితనం, అసమర్థత వల్లే కరవు వచ్చింది. 20 లక్షల ఎకరాల మేర పంట ఎండిపోయింది. నీటి నిర్వహణ తెలియని దద్దమ్మలు రాజ్యం ఏలుతున్నారు. వర్షాలు లేకపోవడం వల్లే కరవు వచ్చిందని చెబుతున్నారు. అది అబద్ధం’ అని మండిపడ్డారు.

Similar News

News October 8, 2024

BIG BREAKING: బీజేపీ సంచలన విజయం

image

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హరియాణాలో బీజేపీ సంచలన విజయం సాధించింది. వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొట్టింది. తొలుత కాంగ్రెస్ భారీ ఆధిక్యంలో దూసుకెళ్లినా క్రమంగా కమలం రేసులోకి వచ్చింది. ఇక అప్పటినుంచి వరుసగా సీట్లు గెలుస్తూ మ్యాజిక్ ఫిగర్ (46) దాటింది. EC లెక్కల ప్రకారం 90 సీట్లకు గాను BJP 46, కాంగ్రెస్ 35 చోట్ల గెలిచాయి. చెరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

News October 8, 2024

బీజేపీని గెలిపించిన 200 రోజుల ముఖ్య‌మంత్రి

image

ఎన్నిక‌ల‌కు 200 రోజుల ముందు హరియాణా CMగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాయ‌బ్ సింగ్ సైనీ BJPని అనూహ్యంగా విజ‌య‌తీరాల‌కు చేర్చారు. డ‌మ్మీ CM అని ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా BJP ఎన్నిక‌ల ప్ర‌చారం మొత్తం ఆయ‌న చుట్టూనే తిరిగింది. ఫ‌లితాల‌పై ముందుగానే బాధ్య‌త వ‌హించిన సైనీ ప్రభుత్వ వ్యతిరేకతలోనూ పార్టీని ముందుండి నడిపారు. అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హ్యాట్రిక్ విజయానికి కార‌ణ‌మ‌య్యారు.

News October 8, 2024

జమ్మూ ప్రజలు మాతోనే ఉన్నారు: కిషన్ రెడ్డి

image

జమ్మూ ప్రాంతంలో బీజేపీ విజయం చరిత్రాత్మకం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు, ఓట్లు పొందామని తెలిపారు. జమ్మూలో 43 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 29 స్థానాలు గెలుచుకుందని, కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించిందని పేర్కొన్నారు. జమ్మూ ప్రజలు తమతోనే ఉన్నారని మరోసారి నిరూపితమైందని వివరించారు. కాగా, J&Kలో కాంగ్రెస్, ఎన్సీ కూటమి గెలవగా, జమ్మూ ప్రాంతంలో బీజేపీ సత్తా చాటింది.