News April 5, 2024

AI వీడియోలపై మెటా కీలక నిర్ణయం

image

డీప్‌ఫేక్ వీడియోలు పెరిగిన నేపథ్యంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టా మాతృసంస్థ మెటా తన పాలసీలలో కీలక మార్పులను ప్రకటించింది. త్వరలో US ఎన్నికలు జరగనుండటంతో AI జెనరేటెడ్ కంటెంట్‌పై నియంత్రణకు సిద్ధమైంది. ఇలాంటి వీడియోలను FB, ఇన్‌స్టాలో పోస్టు చేస్తే ‘Made with AI’ అనే లేబుల్ వచ్చేలా టెక్నాలజీని ప్రవేశపెట్టింది. మే నుంచి ఇది అమల్లోకి రానుంది. మోసపూరిత కంటెంట్‌ నుంచి యూజర్లను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

Similar News

News October 8, 2024

కాంగ్రెస్ అంద‌రినీ రెచ్చ‌గొట్టింది: మోదీ

image

హ‌రియాణాలో కాంగ్రెస్ అన్ని వ‌ర్గాల్ని రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేసిందని, అయినా ప్ర‌జ‌లు ఆ పార్టీని తిర‌స్క‌రించార‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఆందోళ‌న‌ల పేరుతో రైతుల్ని, యువ‌త‌ను, కులాల పేరుతో పేద‌ల్ని రెచ్చ‌గొట్టి స‌మాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్ర‌య‌త్నం చేసింద‌ని మండిప‌డ్డారు. ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. విభజన రాజ‌కీయాలు ఇక ఎంత‌మాత్రం సాగవని పేర్కొన్నారు.

News October 8, 2024

పాక్ రికార్డు బద్దలు కొట్టిన టీమ్ ఇండియా

image

అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ మంది ఆటగాళ్లను పరిచయం చేసిన జట్టుగా టీమ్ ఇండియా అవతరించింది. ఇప్పటివరకు భారత్ 117 మంది ఆటగాళ్లను పరిచయం చేసింది. బంగ్లాతో జరిగిన తొలి టీ20లో నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్ (116) రికార్డును అధిగమించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (111), శ్రీలంక (108), సౌతాఫ్రికా (107), ఇంగ్లండ్ (104), న్యూజిలాండ్ (103) ఉన్నాయి.

News October 8, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు శాశ్వత పరిష్కారం చూపాలని కోరా: CM

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉన్న మార్గాలన్నీ ఆలోచిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్టీల్ ప్లాంట్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరానని చెప్పారు. అమరావతికి వరల్డ్ బ్యాంకు నిధులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశానన్నారు. విశాఖ రైల్వే జోన్ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని పేర్కొన్నారు. గిరిజన వర్సిటీ సాలూరులోనే ఉంటుందని, మార్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.