News April 6, 2024
భారత ఎన్నికలపై చైనా కుట్ర: మైక్రోసాఫ్ట్

దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మైక్రోసాఫ్ట్ సంచలన విషయాలు వెల్లడించింది. ఓటర్లను తప్పుదోవపట్టించేందుకు చైనా కుట్రపన్నుతోందని తెలిపింది. భారత్ సహా ఈ ఏడాది జరగనున్న US, సౌత్కొరియా తదితర దేశాల ఎన్నికలనూ ప్రభావితం చేసేందుకు చైనా సైబర్ గ్రూప్స్ ప్లాన్ చేస్తున్నాయని తెలిపింది. ఏఐతో రూపొందించిన ఫేక్ కంటెంట్ను సోషల్ మీడియాలో ప్రచారం చేసి అనుకూల ఫలితాలు పొందేందుకు డ్రాగన్ ప్లాన్ చేస్తోందట.
Similar News
News November 5, 2025
APPLY NOW : PGIMERలో ఉద్యోగాలు

చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(<
News November 5, 2025
చలికాలంలో జుట్టూడకుండా ఉండాలంటే..

మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో జుట్టు సమస్యలు ఎక్కువ. కాబట్టి జుట్టు సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. తలస్నానానికి గోరువెచ్చటి నీటినే వాడాలి. తర్వాత కండీషనర్ మర్చిపోకూడదు. జుట్టు త్వరగా ఆరడానికి బ్లో డ్రైయ్యర్స్ వాడటం తగ్గించాలని సూచిస్తున్నారు. ఈ సీజన్లో వెంట్రుకలకు ఎంత తరచుగా ఆయిల్ పెడితే అంత మంచిది. తేమ శాతం నిలిచి జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుందంటున్నారు.
News November 5, 2025
నేడు స్కూళ్లు, ఆఫీసులకు సెలవు

ఇవాళ గురుపూర్ణిమతో పాటు గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణలో విద్యాసంస్థలు, బ్యాంకులు, ఆఫీసులు మూసి ఉండనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది. అటు ఏపీలో ఆప్షనల్ హాలిడే మాత్రమే ఉంది కాబట్టి స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు తెరిచి ఉండనున్నాయి. ఉద్యోగులు ఎవరైనా కావాలనుకుంటే సెలవు తీసుకోవచ్చు.


