News April 6, 2024
భారత ఎన్నికలపై చైనా కుట్ర: మైక్రోసాఫ్ట్

దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మైక్రోసాఫ్ట్ సంచలన విషయాలు వెల్లడించింది. ఓటర్లను తప్పుదోవపట్టించేందుకు చైనా కుట్రపన్నుతోందని తెలిపింది. భారత్ సహా ఈ ఏడాది జరగనున్న US, సౌత్కొరియా తదితర దేశాల ఎన్నికలనూ ప్రభావితం చేసేందుకు చైనా సైబర్ గ్రూప్స్ ప్లాన్ చేస్తున్నాయని తెలిపింది. ఏఐతో రూపొందించిన ఫేక్ కంటెంట్ను సోషల్ మీడియాలో ప్రచారం చేసి అనుకూల ఫలితాలు పొందేందుకు డ్రాగన్ ప్లాన్ చేస్తోందట.
Similar News
News April 19, 2026
అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి?

అక్షయ తృతీయ (నేడు) పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిన రోజని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్ర దినాన చేసే స్నానం, జపం, హోమం, దానాలు ‘అక్షయ’మైన (తరగని) ఫలితాలను ఇస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించేలా పేదలకు బట్టలు, గొడుగులు, చెప్పులు, చల్లని మజ్జిగ, నవధాన్యాలు దానం చేయడం విశేషమైన పుణ్యమని తెలుపుతున్నారు. ముఖ్యంగా నీటి కుండను దానం చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.
News April 19, 2026
వీళ్లు ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగొద్దు!

ఉదయాన్నే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ వ్యాధులు, గుండె సమస్యలు ఉన్నవారు నీళ్లు అధికంగా తాగితే ఆయా అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది. గ్యాస్ట్రిక్, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు ఉన్నవారికి కడుపులో ఇబ్బంది కలగొచ్చు. ఒంట్లో నీరు చేరి వాపులు వచ్చే వారు కూడా వైద్యుల సలహా మేరకే నీటిని తీసుకోవాలి.
News April 19, 2026
హైకోర్టులో ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్ డేట్

AP హైకోర్టులో 300 ఉద్యోగాలకు అప్లై చేసుకునే గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇందులో అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీసర్ సబార్డినేట్, టైపిస్ట్ తదితర ఉద్యోగాలున్నాయి. పోస్టుల ఆధారంగా 7వ తరగతి/డిగ్రీ/బీటెక్, షార్ట్ హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు ఉండాలి. CBT, స్కిల్ ఆధారంగా ఎంపిక ఉండనుంది. పోస్టులను బట్టి నెల వేతనం రూ.20వేల-రూ.లక్షన్నర వరకు ఉంది. నోటిఫికేషన్, అప్లై చేయడానికి ఇక్కడ <


