News April 6, 2024
ఇజ్రాయెల్-హమాస్ పోరు.. 33,000 దాటిన మరణాలు
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి రేపటితో ఆరు నెలలు పూర్తికానుంది. ఇప్పటి వరకు 13 వేల మంది ఉగ్రవాదులను హతమార్చామని ఇజ్రాయెల్ చెబుతోంది. గాజాలో 33,000 మంది పౌరులు మరణించడం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. యుద్ధాన్ని విరమింపజేసేందుకు ఐక్యరాజ్యసమితి సహా పలు దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. హమాస్ను నిర్మూలించే వరకు తమ పోరాటం ఆగదని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తోంది.
Similar News
News October 9, 2024
నాగార్జునVSసురేఖ: ఈనెల 10న మరో వ్యక్తి వాంగ్మూలం రికార్డు
తమ కుటుంబంపై మంత్రి సురేఖ ఆరోపణలను ఖండిస్తూ హీరో నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం దావా కేసు విచారణ ఈనెల 10కి వాయిదా పడింది. ఆరోజు మరో సాక్షి వాంగ్మూలం రికార్డు చేస్తామని నాగ్ తరఫు లాయర్ అశోక్రెడ్డి తెలిపారు. అదే రోజు మంత్రికి నోటీసులు జారీ చేసే అవకాశముందన్నారు. అటు నాగార్జున పిటిషన్ నిలబడదని సురేఖ న్యాయవాది తిరుపతివర్మ అన్నారు. ఆయన పిటిషన్లో ఒకలా, కోర్టు వాంగ్మూలంలో మరోలా చెప్పారన్నారు.
News October 9, 2024
నేడు టీడీపీలో చేరనున్న మస్తాన్ రావు, మోపిదేవి
AP: వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ నేడు టీడీపీలో చేరనున్నారు. ఉండవల్లిలోని నివాసంలో వారిద్దరికి సీఎం చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల వీరిద్దరూ వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.
News October 9, 2024
INDvsBAN: కొట్టేస్తారా? ఛాన్సిస్తారా?
భారత్, బంగ్లాదేశ్ మధ్య 3 మ్యాచ్ల T20 సిరీస్లో 2వ మ్యాచ్ ఈ రోజు జరగనుంది. ఈనెల 6న జరిగిన తొలి T20లో భారత్ గెలిచింది. ఈరోజు భారత్ గెలిస్తే సిరీస్ వశం కానుంది. బంగ్లా గెలిస్తే సిరీస్ 1-1గా మారి 3వ మ్యాచ్ కీలకంగా మారుతుంది. ఈనేపథ్యంలోనే నేటి మ్యాచ్లో గెలవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. మరి భారత్ గెలిచి సిరీస్ వశం చేసుకుంటుందా? లేక బంగ్లాకు ఛాన్స్ ఇస్తుందా? వేచి చూడాలి. రా.7గంటలకు మ్యాచ్ ప్రారంభం.