News February 5, 2025
మద్యం అక్రమాలపై ‘సిట్’ ఏర్పాటు

AP: రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో SIT (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఏర్పాటు చేసింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు జరిగిన విక్రయాలపై సిట్ దర్యాప్తు చేయనుంది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దీనికి నేతృత్వం వహించనున్నారు. SITకు అవసరమైన సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను ఆదేశించింది.
Similar News
News March 18, 2025
ఎప్పుడూ నీరసం, అలసటగా ఉంటుందా?

కొందరికి ఎలాంటి శారీరక, మానసిక శ్రమ చేయకపోయినా నీరసం, అలసట వస్తుంది. దీనికి అనేక కారణాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే దీనిని నివారించవచ్చు. శరీరంలో తగినంత ఐరన్ లేకపోతే ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఉదయం ఏదో ఒక ఆహారం తింటే నీరసం, అలసట ఉండదు. లంచ్లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. రోజూ తగినన్ని నీళ్లు తాగాలి. వారంలో ఒకరోజుకు మించి ఉపవాసం చేయకూడదు.
News March 18, 2025
స్త్రీ2, పుష్ప-2ను అధిగమించిన ఛావా

‘ఛావా’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన ఐదో వారం హిందీలో అత్యధిక వసూళ్లు (₹22cr) సాధించిన సినిమాగా నిలిచింది. స్త్రీ-2 (₹16cr), పుష్ప-2 (₹14cr) సినిమాల్ని అధిగమించింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ఇండియాలో నెట్ కలెక్షన్స్ ₹562.65crకు పైగా రాగా, ప్రపంచ వ్యాప్తంగా ₹750.5crకు పైగా వచ్చాయి. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.
News March 18, 2025
మోదీతో జోక్ చేసిన న్యూజిలాండ్ ప్రధాని

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్, మోదీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇటీవల భారత్ CTకప్ గెలవటం మోదీ ప్రస్తావించలేదు. నేను కూడా భారత్ పై న్యూజిలాండ్ టెస్ట్ విజయాల టాపిక్ తీయలేదు. ఈ రెండు విషయాలను పక్కన పెడదామని క్రిస్టఫర్ చమత్కరించారు. దీంతో ప్రధాని మోదీ తోపాటు క్రికెటర్ రాస్ టేలర్ తదితరులు నవ్వులు చిందించారు.