News April 6, 2024
రేపు 64 మండలాల్లో తీవ్ర వడగాలులు
AP: రాష్ట్రంలో ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రేపు 64 మండలాల్లో తీవ్ర వడగాలులు, 222 మండలాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. సగటున 40-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావొద్దని సూచించింది. వడగాలులు వీచే మండలాల జాబితా కోసం ఇక్కడ <
Similar News
News October 9, 2024
నేడు టీడీపీలో చేరనున్న మస్తాన్ రావు, మోపిదేవి
AP: వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ నేడు టీడీపీలో చేరనున్నారు. ఉండవల్లిలోని నివాసంలో వారిద్దరికి సీఎం చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల వీరిద్దరూ వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.
News October 9, 2024
INDvsBAN: కొట్టేస్తారా? ఛాన్సిస్తారా?
భారత్, బంగ్లాదేశ్ మధ్య 3 మ్యాచ్ల T20 సిరీస్లో 2వ మ్యాచ్ ఈ రోజు జరగనుంది. ఈనెల 6న జరిగిన తొలి T20లో భారత్ గెలిచింది. ఈరోజు భారత్ గెలిస్తే సిరీస్ వశం కానుంది. బంగ్లా గెలిస్తే సిరీస్ 1-1గా మారి 3వ మ్యాచ్ కీలకంగా మారుతుంది. ఈనేపథ్యంలోనే నేటి మ్యాచ్లో గెలవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. మరి భారత్ గెలిచి సిరీస్ వశం చేసుకుంటుందా? లేక బంగ్లాకు ఛాన్స్ ఇస్తుందా? వేచి చూడాలి. రా.7గంటలకు మ్యాచ్ ప్రారంభం.
News October 9, 2024
మరో కొత్త కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం?
TG: మహిళా సంఘాలను బలోపేతం చేసే దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ద్వారా బస్సులను కొనుగోలు చేసి అద్దెకు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రయోగాత్మకంగా మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాలో దీనిని అమలు చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.