News April 7, 2024
డిగ్రీ ఫెయిలైన వారికి గుడ్న్యూస్
TG: ఓయూ పరిధిలో డిగ్రీ చదివి ఫెయిలైన పూర్వ విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. BA, BCOM, BSC ఇతర డిగ్రీ కోర్సుల్లో 2000-2019 వరకు ఫెయిలైన వారు ఈనెల 15 వరకు ఫీజు చెల్లించాలని, అపరాధ రుసుముతో ఈనెల 20 నుంచి 22 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. గతంలో ఒక్క సబ్జెక్టుకు ₹10వేలుగా ఉన్న ఫీజును ఇప్పుడు ₹2వేలకు తగ్గించినట్లు తెలిపారు. వివరాలకు ఓయూ వెబ్సైట్ చూడాలని సూచించారు.
Similar News
News October 9, 2024
హరియాణాలో ఓడిన స్పీకర్, 8 మంది BJP మంత్రులు
హరియాణాలో వరుసగా మూడోసారి BJP గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే గత క్యాబినెట్లోని 10 మంది మంత్రుల్లో ఎనిమిది మంది ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ స్పీకర్ జియాన్ చంద్ గుప్తా కూడా ఓడిపోయారు. దీంతో అక్కడ మంత్రివర్గంలోకి కొత్తముఖాలు కనిపించనున్నాయి.
News October 9, 2024
ఇవాళ ఈ శ్లోకాన్ని పఠించండి!
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏడోరోజు మూలా నక్షత్రం, సరస్వతి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. చదువులతల్లి జన్మనక్షత్రం కావడంతో పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తే విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయంటారు. ఇవాళ ‘సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా, పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణినీ, నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ’ శ్లోకాన్ని పఠిస్తూ అమ్మవారిని పూజించండి.
News October 9, 2024
కులగణనకు సిద్ధమైన ప్రభుత్వం!
TG: రాష్ట్ర ప్రభుత్వం కులగణనకు సిద్ధమైంది. నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తోంది. దీని కోసం రేవంత్ సర్కారు రూ.150 కోట్లు కేటాయించగా గైడ్ లైన్స్ ఖరారు కావాల్సి ఉంది. 30 రోజుల్లో 90వేల మంది సిబ్బందితో ఈ గణన పూర్తి చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు ఫైనల్ చేసి ప్రకటన చేసే అవకాశం ఉంది.