News April 7, 2024
డిగ్రీ ఫెయిలైన వారికి గుడ్న్యూస్
TG: ఓయూ పరిధిలో డిగ్రీ చదివి ఫెయిలైన పూర్వ విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. BA, BCOM, BSC ఇతర డిగ్రీ కోర్సుల్లో 2000-2019 వరకు ఫెయిలైన వారు ఈనెల 15 వరకు ఫీజు చెల్లించాలని, అపరాధ రుసుముతో ఈనెల 20 నుంచి 22 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. గతంలో ఒక్క సబ్జెక్టుకు ₹10వేలుగా ఉన్న ఫీజును ఇప్పుడు ₹2వేలకు తగ్గించినట్లు తెలిపారు. వివరాలకు ఓయూ వెబ్సైట్ చూడాలని సూచించారు.
Similar News
News February 5, 2025
IBPS పీవో స్కోర్ కార్డులు విడుదల
IBPS పీవో మెయిన్స్ స్కోర్ కార్డులు వచ్చేశాయి. గతేడాది NOVలో ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల ఫలితాలను జనవరి 31న రిలీజ్ చేయగా, తాజాగా స్కోర్ కార్డులను అందుబాటులో ఉంచారు. <
News February 5, 2025
మద్యం అక్రమాలపై ‘సిట్’ ఏర్పాటు
AP: రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో SIT (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఏర్పాటు చేసింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు జరిగిన విక్రయాలపై సిట్ దర్యాప్తు చేయనుంది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దీనికి నేతృత్వం వహించనున్నారు. SITకు అవసరమైన సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను ఆదేశించింది.
News February 5, 2025
భారతీయులకు సంకెళ్లు వేసి తెచ్చారా?.. నిజమిదే!
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని ట్రంప్ ప్రభుత్వం యుద్ధ విమానంలో ఇండియాకు పంపిన విషయం తెలిసిందే. వీరికి విమానంలో సంకెళ్లు వేసి తీసుకొచ్చారన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో నిజం లేదు. అవి గ్వాటెమాలా, ఈక్వెడార్, కొలంబియా దేశాలకు చెందిన అక్రమ వలసదారులవి. ఈ విషయం తెలియక కాంగ్రెస్.. భారతీయులను అమెరికా నేరస్థులుగా పంపడం అవమానకరమని, చూడలేకపోతున్నామని వ్యాఖ్యానించింది.