News April 7, 2024

ఈనెల 25న పదో తరగతి ఫలితాలు?

image

AP: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఈనెల 25న ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం. దీనిపై విద్యాశాఖ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మూల్యాంకన ప్రక్రియ సోమవారంతో ముగియనుందని అధికారులు చెబుతున్నారు. నేడు మధ్యాహ్నం వరకు 95% పూర్తవుతుందన్నారు. ఈసీ అనుమతి తీసుకున్నాకే ఫలితాలను వెల్లడిస్తారని, ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఈనెల 30లోపు ఫలితాల ప్రకటన ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Similar News

News November 13, 2025

17న ఎమ్మెల్యేల అనర్హత సహా అన్ని పిటిషన్లపై విచారణ

image

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లన్నిటినీ సోమవారం (17వ తేదీ) విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. కోర్టు నిర్దేశించిన 3 నెలల గడువులోగా ఫిరాయింపు MLAలపై చర్యలు తీసుకోలేదంటూ BRS ఇటీవల స్పీకర్‌పై ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేయడం తెలిసిందే. వీటిపై నిర్ణయానికి మరో 2నెలల సమయం కావాలని స్పీకర్ కార్యాలయం అంతకు ముందే SCని కోరింది. అన్ని పిటిషన్లను కలిపి విచారణ చేస్తామని సుప్రీం తాజాగా స్పష్టం చేసింది.

News November 13, 2025

BOB క్యాపిటల్‌లో ఉద్యోగాలు

image

బ్యాంక్ ఆఫ్ బరోడా అనుబంధ సంస్థ BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీఏ, సీఏ, సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in/

News November 13, 2025

నవోదయ, KVSలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

దేశంలోని నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్‌ టీచింగ్ పోస్టులకు CBSE షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి <>వెబ్‌సైట్‌లో<<>> అప్లై చేసుకోవాలని సూచించింది. డిసెంబర్ 4న దరఖాస్తు గడువు ముగుస్తుంది. పోస్టుల సంఖ్య, పరీక్ష తేదీలు తదితర వివరాలను త్వరలో వెల్లడించనుంది.