News October 8, 2025

కనకాంబరంలో ఎండు తెగులు నివారణ ఎలా?

image

కనకాంబరంలో ఎండు తెగులు ముఖ్యమైన సమస్య. ఈ తెగులు ఆశించిన కనకాంబరం మొక్క ఆకులు వాలిపోయి, ఆకు అంచు పసుపు రంగుకు మారుతుంది. వేర్లు, కాండం, మొదలు కుళ్లడం వల్ల మొక్క అకస్మాత్తుగా ఎండిపోతుంది. దీంతో మొక్కలు గుంపులుగా చనిపోతాయి. ఎండు తెగులు నివారణకు తెగులు ఆశించిన మొక్కల మొదళ్లు తడిచేలా.. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. కలిపి.. ఒక్కో మొక్కకు 20-25 మిల్లీ లీటర్ల ద్రావణాన్ని పోయాలి.

Similar News

News October 8, 2025

ALERT.. ‘కాపీ పేస్ట్’ చేస్తున్నారా?

image

టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. అట్రాక్ట్ చేసే కంటెంట్, టెక్ట్స్ మెసేజ్‌ల‌తో యూజర్లను మాయచేస్తున్నారు. పాపప్స్ నమ్మి కంటెంట్ కాపీ పేస్ట్ చేస్తే ఫోన్లు, కంప్యూటర్లలోకి మాల్‌వేర్‌ను పంపుతున్నారు. దీంతో డివైస్‌లు హ్యాక్ చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడు డివైస్ అప్డేట్ చేయడంతో పాటు అనవసరమైన లింక్స్ క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు. SHARE

News October 8, 2025

మీరు వద్దనుకున్నవి.. వారికి సంతోషాన్నిస్తాయి!

image

దీపావళి సందర్భంగా అందరూ ఇళ్లు శుభ్రం చేసుకుంటూ పాత వస్తువులను బయట పారేస్తుంటారు. అయితే పనికొచ్చే వస్తువులను, దుస్తులను పడేసే ముందు ఓసారి ఆలోచించండి. మీరు వద్దనుకునే ఆ వస్తువులు ఎంతోమందికి ఉపయోగపడొచ్చు. బట్టలు, పుస్తకాలు, ఆట బొమ్మలు, వంట సామగ్రి, పాదరక్షలు, ఎలక్ట్రానిక్స్ మొదలైన వస్తువులను అవసరమైన వాళ్లకు ఇచ్చేందుకు ముందుకురండి. చాలా NGOలు, శరణాలయాలు వీటిని స్వీకరిస్తాయి. SHARE IT

News October 8, 2025

పాడిరైతులకు భరోసా- ఉచిత పశుగ్రాసం సాగు పథకం

image

AP: వ్యవసాయ భూమి ఉండి, పాడి పశువుల పోషణతో కుటుంబాలను పోషించుకుంటున్న చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ఉచిత పశుగ్రాసం సాగు పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద పశుగ్రాసం సాగు చేస్తే ఉపాధిహామీ పథకం కింద వందశాతం రాయితీ అందిస్తుంది. కనిష్ఠంగా 10 సెంట్లు, గరిష్ఠంగా 50 సెంట్ల వరకు పశుగ్రాసాన్నిపెంచుకోవచ్చు. గరిష్ఠంగా రూ.32,992, కనిష్ఠంగా రూ.6,559 ప్రభుత్వ సాయంగా అందుతుంది.