News October 8, 2025
విజయ్ దేవరకొండ కొత్త సినిమా అప్డేట్!

విజయ్ దేవరకొండ హీరోగా ‘రౌడీ జనార్దన’ టైటిల్తో ఓ సినిమా తీయనున్నట్లు ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఈనెల 11న లాంచ్ చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. 16వ తేదీ నుంచి ముంబైలో రెగ్యులర్ షూట్ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నాయి. ‘రాజావారు రాణిగారు’ సినిమా ఫేమ్ రవి కిరణ్ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తారని సమాచారం.
Similar News
News October 8, 2025
NCLTలో 32 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT)లో 32 స్టెనోగ్రాఫర్, ప్రైవేట్ సెక్రటరీస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణులైన కంప్యూటర్ స్కిల్స్, టైపింగ్ నాలెడ్జ్ గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్టెనోగ్రాఫర్కు నెలకు రూ.45వేలు, ప్రైవేట్ సెక్రటరీకి రూ.50వేలు జీతం అందిస్తారు. వెబ్ సైట్: https://nclt.gov.in/
News October 8, 2025
చిన్న పిల్లలకు దిష్టి ఎందుకు తీస్తారు?

వేడుకలకు వెళ్లొచ్చిన తర్వాత పసుపు, సున్నం కలిపిన నీటితో చిన్నపిల్లలకు దిష్టి తీస్తుంటారు. దీని వెనుక సైన్స్ కూడా ఉందని పండితులు చెబుతున్నారు. ఫంక్షన్స్లో చుట్టాలు చిన్నపిల్లల చుట్టూ చేరుతారు. దీంతో పిల్లలు అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంటుంది. దిష్టి ద్వారా ఎరుపు నీటిని చూస్తే.. వారి మనసుకు ప్రశాంతత, ధైర్యం కలుగుతుందట. ఈ ఆచారం వారికి శుభాన్ని అందించి, హాయిగా నిద్రపోవడానికి తోడ్పడుతుందని నమ్మకం.
News October 8, 2025
నీటిలో TDS స్థాయులను చెక్ చేస్తున్నారా?

ప్రస్తుతం చాలామంది మినరల్ లేదా ప్యూరిఫయర్ ద్వారా శుద్ధి చేసిన నీటిని తాగుతున్నారు. అయితే సరైన TDS స్థాయులున్న నీటినే తాగాలని వైద్యులు చెబుతున్నారు. TDS గరిష్ఠంగా 500 mg/L మాత్రమే ఉండాలని BIS చెబుతుంటే WHO 300 కంటే తక్కువ ఉంటే బెస్ట్, 300-600 మధ్యలో ఉంటే మంచివంటోంది. అయితే ప్యూరిఫయర్లు నీటిలోని TDS స్థాయులను నియంత్రించగలవు. ఇవి 50 కంటే తక్కువ చేస్తే అందులో ముఖ్యమైన ఖనిజాలను కోల్పోవచ్చు. SHARE IT