News October 8, 2025

కరూర్ తొక్కిసలాటపై రిషబ్ శెట్టి ఏమన్నారంటే?

image

తమిళనాడులో హీరో విజయ్ ర్యాలీలో చోటు చేసుకున్న <<17885395>>తొక్కిసలాట<<>> ఘటన దురదృష్టకరమని ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి అన్నారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు. ఇది ఒక్కరి తప్పు కాదని సమష్టి పొరపాటుగా భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందని పేర్కొన్నారు. పోలీసులు, ప్రభుత్వంపై నింద వేయడం సులభమేనని, అంత జనం ఉన్నప్పుడు వారిని నియంత్రించడం సమస్యేనని పేర్కొన్నారు.

Similar News

News March 21, 2026

బాంబుల మోత మధ్య పండుగ!

image

దూసుకొచ్చే మిస్సైళ్లు.. ఎప్పుడు ఎక్కడ పడతాయో తెలియని బాంబులు. ఇలాంటి భయానక వాతావరణంలో ఇరాన్ సహా గల్ఫ్ దేశాలు రంజాన్ జరుపుకుంటున్నాయి. ఇప్పటికే ఇరాన్-US, ఇజ్రాయెల్ యుద్ధం వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా విరుచుకుపడుతుండగా ప్రతీకారంతో ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. దీంతో ముస్లింలు ఆనందంగా జరుపుకునే పండుగ భయం గుప్పిట్లో జరుపుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

News March 21, 2026

‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

image

పవన్-హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.59 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు Sacnilk తెలిపింది. ఇండియాలో రూ.52 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.7 కోట్లు సాధించినట్లు వివరించింది. మొత్తంగా రూ.44 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయంది. గురువారంతో పోల్చితే శుక్రవారం థియేటర్లలో షోలతో పాటు సీట్ల ఆక్యుపెన్సీ తగ్గిందని పేర్కొంది. మరి మీరు మూవీ చూశారా? ఎలా ఉంది?

News March 21, 2026

ఇరాన్‌పై దాడులకు US సాయం కోరిందా? భారత్ స్పందనిదే..

image

ఇరాన్‌పై బాంబు దాడి చేసేందుకు భారత మిలిటరీ స్థావరాలను వాడుకునేందుకు అమెరికా అనుమతి కోరిందన్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఇందులో నిజం లేదని, ఇలాంటి వార్తలను నమ్మవద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా ఇరు దేశాల మధ్య ఉన్న లాజిస్టిక్స్ ఎక్స్‌ఛేంజ్ మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్(LEMOA) ప్రకారం భారత్ దీనికి అనుమతి ఇవ్వొచ్చని ఓ జర్నలిస్ట్ చేసిన పోస్టుకు MEA ఈ విధంగా స్పందించింది.