News April 8, 2024
బత్తాయి, నిమ్మ రైతులకు గడ్డుకాలం

TG: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో బత్తాయి, నిమ్మ తోటలు ఎండిపోయాయి. ఇప్పటికే సాగు విస్తీర్ణం తగ్గుతుంటే.. ఇప్పుడు వర్షాలు లేక రైతులకు మరింత గడ్డుకాలం వచ్చింది. 15ఏళ్ల క్రితం 3.24లక్షల ఎకరాల్లో బత్తాయి, 2.20లక్షల ఎకరాల్లో నిమ్మ సాగయ్యేది. సుమారు 10లక్షల కుటుంబాలు వీటిపై ఆధారపడేవి. ఈఏడాది బత్తాయి సాగు లక్ష నుంచి 76వేల ఎకరాలకు తగ్గింది. నిమ్మ సాగు సైతం ఈ ఏడాది 19 వేల ఎకరాలు తగ్గింది.
Similar News
News March 12, 2026
రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు

TG: మండుతున్న ఎండలు, ఉక్కపోతకు ఉపశమనం కలిగించేలా రాష్ట్రంలో 2 రోజులు వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 15, 16 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్, హైదరాబాద్, మేడ్చల్, MBNR జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయని పేర్కొంది. అప్పటివరకు ఎండలు దంచి కొట్టనున్నాయని వెల్లడించింది.
News March 12, 2026
ఆయిల్ ధరలు పెరిగితే అమెరికాకే లాభం.. కానీ: ట్రంప్

క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే అమెరికాకే బెనిఫిట్ అని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అని.. ధరలు పెరిగితే USకు భారీగా ఆదాయం వస్తుందన్నారు. కానీ అది తన ప్రాధాన్యం కాదన్నారు. న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకుండా, పశ్చిమాసియాతో పాటు ప్రపంచాన్ని నాశనం చేయకుండా ఇరాన్ను అడ్డుకోవడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.
News March 12, 2026
కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం!

AP: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 2026-27లో 352 స్కూళ్లలో 6, 11 తరగతుల్లో అడ్మిషన్లకు, 7, 8, 9, 10, 12 తరగతుల్లో ఖాళీ సీట్ల కోసం <


