News April 8, 2024
బత్తాయి, నిమ్మ రైతులకు గడ్డుకాలం

TG: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో బత్తాయి, నిమ్మ తోటలు ఎండిపోయాయి. ఇప్పటికే సాగు విస్తీర్ణం తగ్గుతుంటే.. ఇప్పుడు వర్షాలు లేక రైతులకు మరింత గడ్డుకాలం వచ్చింది. 15ఏళ్ల క్రితం 3.24లక్షల ఎకరాల్లో బత్తాయి, 2.20లక్షల ఎకరాల్లో నిమ్మ సాగయ్యేది. సుమారు 10లక్షల కుటుంబాలు వీటిపై ఆధారపడేవి. ఈఏడాది బత్తాయి సాగు లక్ష నుంచి 76వేల ఎకరాలకు తగ్గింది. నిమ్మ సాగు సైతం ఈ ఏడాది 19 వేల ఎకరాలు తగ్గింది.
Similar News
News January 16, 2026
110 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పుదుచ్చేరిలోని <
News January 16, 2026
ఆయుధం పట్టకుండా జ్ఞాన యుద్ధం చేసిన విదురుడు

మహాభారతంలో విదురుడు ఆయుధం పట్టకుండానే జ్ఞాన యుద్ధం చేశారు. కత్తి కంటేమాట పదునైనదని నమ్మి, తన వాక్చాతుర్యంతో కురువంశాన్ని కాపాడేందుకు నిరంతరం శ్రమించారు. ధృతరాష్ట్రుడి అంధకార బుద్ధికి దిక్సూచిగా ఉంటూ, దుర్యోధనుడి దురాలోచనలను ముందే పసిగట్టి హెచ్చరించారు. ధర్మం వైపు నిలబడి ఆయన చేసిన ప్రతి సూచన అహంకారంపై సాగిన భీకర పోరాటం. దుర్మార్గంపై ధర్మం సాధించే నిశ్శబ్ద గెలుపును విదురుని జీవితం మనకు చెబుతుంది.
News January 16, 2026
రూ.238కోట్లు కలెక్ట్ చేసిన ‘రాజాసాబ్’

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన ‘రాజాసాబ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లో రూ.238కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘కింగ్ సైజ్ బ్లాక్బస్టర్’ అంటూ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. సంక్రాంతి సందర్భంగా ఈనెల 9న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. తమన్ మ్యూజిక్ అందించారు.


