News April 13, 2024

కాంగ్రెస్ 4 నెలల్లో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లింది: హరీశ్

image

TG: కేసీఆర్ అభివృద్ధి బాట పట్టించిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ 4 నెలల్లోనే వెనక్కి తీసుకెళ్లిందని MLA హరీశ్‌రావు విమర్శించారు. ‘కాంగ్రెస్ ఫేక్ వార్తలను నమ్ముకుని రాజ్యం నడుపుతోంది. వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత యువతపై ఉంది. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న BJP ప్రజలకు చేసిందేమీ లేదు. నల్లచట్టాలు తెచ్చి 700 మంది రైతుల ప్రాణాలు తీసింది. నిరుద్యోగం, పేదరికం పెరిగింది.’ అని అన్నారు.

Similar News

News March 5, 2026

4 రోజుల్లో రూ.9,560 తగ్గిన 10గ్రా.ల గోల్డ్ రేటు

image

బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వీటి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.980 తగ్గి రూ.1,63,530కు చేరింది. నాలుగు రోజుల్లోనే రూ.9,560 తగ్గడం విశేషం. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.900 పతనమై రూ.1,49,900 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ.2,95,000గా ఉంది.

News March 5, 2026

రష్మిక చెల్లిని చూశారా?

image

రష్మిక-విజయ్ రిసెప్షన్ నిన్న HYDలో ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత తొలిసారి రష్మిక ఫ్యామిలీ కెమెరాల కంటపడింది. దీంతో వారి వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె చెల్లి 14ఏళ్ల షిమాన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. రిసెప్షన్‌కు వచ్చిన అతిథులకు రష్మిక తన చెల్లిని పరిచయం చేస్తూ కనిపించారు. షిమాన్‌కు తనకు 15ఏళ్ల ఏజ్ గ్యాప్ వల్ల ఆమెను బిడ్డలా చూసుకుంటానని గతంలో రష్మిక తెలిపారు.

News March 5, 2026

తేరుకున్న మార్కెట్లు.. లాభాల్లో ప్రారంభం

image

ఇరాన్ వార్ వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా, నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గత 3 సెషన్లలో భారీ నష్టాలు చవిచూడగా ఇవాళ ఇన్వెస్టర్లు అనూహ్యంగా పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో కోల్ ఇండియా, రిలయన్స్, అదానీ పోర్ట్స్, ONGC, NTPC షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.