News April 13, 2024
కేజ్రీవాల్ పిటిషన్పై 15న సుప్రీం విచారణ
లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును CM కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం ఈనెల 15న విచారించనుంది. తన అరెస్టు అక్రమమని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా ట్రయల్ కోర్టు కేజ్రీవాల్ను ఆరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించి, ఆ తర్వాత మరో 4 రోజులు పొడిగించింది. అది ముగిశాక ఈనెల 15 వరకు జుడీషియల్ కస్టడీ విధించింది.
Similar News
News October 11, 2024
ట్రిలియన్ డాలర్లు దాటిన భారత కుబేరుల సంపద!
భారత కుబేరుల సంపద మొత్తం కలిపి తొలిసారిగా ట్రిలియన్ డాలర్లను దాటిందని ఫోర్బ్స్ సంస్థ ప్రకటించింది. 2019తో పోలిస్తే వారి సంపద రెట్టింపైందని తెలిపింది. ఒక్క 2023లోనే వారు 316 బిలియన్ డాలర్లను సంపాదించారని పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ పాజిటివ్గా ఉందని కొనియాడింది. కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ (119.5 బిలియన్ డాలర్లు) అగ్రస్థానంలో ఉన్నారు. అదానీ(116 బిలియన్ డాలర్లు) 2వ స్థానంలో నిలిచారు.
News October 11, 2024
బెల్లీ ల్యాండింగ్ అంటే ఏంటి..?
విమానం టేకాఫ్, ల్యాండింగ్లో ల్యాండింగ్ గేర్ అనేది కీలకం. ఇది విమాన చక్రాలు, స్ట్రట్స్, షాక్ అబ్సార్బర్స్తో అనుసంధానమై పనిచేస్తుంది. ఇందులో సమస్య ఏర్పడి చక్రాలు తెరుచుకోని పరిస్థితుల్లో బెల్లీ ల్యాండింగ్ చేస్తారు. అంటే విమానాన్ని చక్రాల ద్వారా కాకుండా నేరుగా విమానం మధ్య భాగం (బెల్లీ) భూమిని తాకేలా ల్యాండ్ చేస్తారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో చివరి అవకాశంగా దీనికి అనుమతిస్తుంటారు.
News October 11, 2024
మెగాస్టార్తో విక్టరీ వెంకటేశ్: పిక్స్ వైరల్
‘విశ్వంభర’ సెట్స్లో మెగాస్టార్ చిరంజీవిని హీరో దగ్గుబాటి వెంకటేశ్ కలిశారు. ఆయనతోపాటు హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ కూడా చిరును కలిసి సందడి చేశారు. కాగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకీ ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి, ఐశ్వర్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోవైపు చిరు నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ టీజర్ రేపు ఉదయం హైదరాబాద్లోని మైత్రీ విమల్ థియేటర్లో విడుదల కానుంది.