News April 14, 2024

జగన్‌పై దాడి ఘటన.. వైసీపీ కీలక ప్రకటన

image

AP: రాయి దాడిలో గాయపడిన CM జగన్‌కు అర్ధరాత్రి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేశారు. గాయానికి 2 కుట్లు వేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి YCP కీలక ప్రకటన చేసింది. ఎవరూ ఆందోళన చెందవద్దని, దయచేసి అందరూ సంయమనం పాటించాలని X వేదికగా కోరింది. మరోవైపు జగన్‌పై దాడిని CBN నిజంగానే ఖండించారనుకుంటే టీడీపీ X అకౌంట్ నుంచి ఎందుకు నీచంగా పోస్టులు చేయిస్తున్నారంటూ వైసీపీ మండిపడింది.

Similar News

News October 12, 2024

చెడుపై మంచి సాధించిన విజయమే దసరా

image

అధర్మంపై ధర్మం విజయం సాధించినందుకు దసరాను జరుపుకుంటారు. దీని వెనుక వేర్వేరు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సురులను, ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని దుర్గాదేవి అంతమొందించిన రోజును విజయదశమిగా పిలుస్తారు. సీతను అపహరించిన రావణుడిపై యుద్ధంలో శ్రీరాముడు ఇదే రోజున విజయం సాధించారని పురాణాల్లో ఉంది. చెడు ఎంత భయంకరంగా ఉన్నా అంతిమ విజయం మంచిదేనని ఈ పండుగ చాటి చెబుతోంది.

News October 12, 2024

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి నవనీత్ కౌర్ దూరం!

image

బీజేపీ నేత నవనీత్ కౌర్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోదని భావిస్తున్నట్లు ఆమె భర్త రవి రాణా తెలిపారు. బీజేపీ అధిష్ఠానం ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో అమరావతి నుంచి పోటీ చేసిన నవనీత్ కౌర్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు వచ్చే నెల 26తో మహా అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ క్రమంలో త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశముంది.

News October 12, 2024

తెలుగు ప్రజలకు చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు

image

తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా జరుపుకుంటామని తెలిపారు. దుష్ట సంహారం తర్వాత శాంతి, సౌభ్రాతృత్వంతో అందరూ కలసి మెలసి జీవించాలన్నదే ఈ పండుగ సందేశమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో శాంతియుత, అభివృద్ధికారక సమాజం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలంతా చల్లగా చూడాలని దుర్గమ్మను ప్రార్థించానని చెప్పారు.