News April 14, 2024
జగన్పై దాడి ఘటన.. వైసీపీ కీలక ప్రకటన

AP: రాయి దాడిలో గాయపడిన CM జగన్కు అర్ధరాత్రి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేశారు. గాయానికి 2 కుట్లు వేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి YCP కీలక ప్రకటన చేసింది. ఎవరూ ఆందోళన చెందవద్దని, దయచేసి అందరూ సంయమనం పాటించాలని X వేదికగా కోరింది. మరోవైపు జగన్పై దాడిని CBN నిజంగానే ఖండించారనుకుంటే టీడీపీ X అకౌంట్ నుంచి ఎందుకు నీచంగా పోస్టులు చేయిస్తున్నారంటూ వైసీపీ మండిపడింది.
Similar News
News March 15, 2026
ADB: వ్యర్థాలతో వంటింట్లో వెలుగులు..!

జిల్లాలో పత్తి సాగు అధికం. ఏటా పంట కోత తర్వాత మిగిలే పత్తి కట్టెలను రైతులు పొలాల్లోనే తగులబెడుతుంటారు. పెరుగుతున్న గ్యాస్ ధరల నేపథ్యంలో ఈ కట్టెలే పేదలకు కొంగుబంగారంగా మారాయి. వీటిని చిన్న ముక్కలుగా చేసి ‘బ్రిక్వెట్స్’ (తెల్ల బొగ్గు)గా మార్చడం ద్వారా పొగలేని ఇంధనాన్ని పొందవచ్చు. దీనివల్ల గ్యాస్ ఖర్చు తగ్గడమే కాక, పర్యావరణ కాలుష్యం అదుపులోకి వస్తుంది. రైతులు వీటిని అమ్మి డబ్బు సంపాదించొచ్చు.
News March 15, 2026
102 ఏళ్ల బామ్మ.. రోజూ మద్యం, మాంసం తీసుకుంటూ..

చక్కటి జీవనశైలితోనే ఎక్కువ కాలం జీవిస్తారనే సిద్ధాంతానికి సవాల్ విసురుతున్నారు చైనాకు చెందిన జిన్ బావోలింగ్(102). ఆమె రోజూ పంది మాంసం, కేక్స్, బ్రెడ్స్, బ్రౌన్ షుగర్తో కాఫీ, ఆల్కహాల్ తీసుకుంటారు. రోజుకు 15 గంటలు నిద్రపోతారు. కూరగాయలు అరుదుగా తినే బామ్మ ఇప్పటికీ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారు. గత 50 ఏళ్లలో ఆస్పత్రి మెట్లు ఎక్కలేదని కుటుంబీకులు చెప్పారు. జిన్ స్టోరీ SMలో వైరలవుతోంది.
News March 15, 2026
మార్చి 31లోపు ఈ పనులు చేయండి!

FY26 ముగిసేలోపు(మార్చి 31) పొదుపు ఖాతాల్లో కనీస మొత్తం డిపాజిట్ చేయాలి. లేదంటే అవి బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. రీయాక్టివేట్ చేయడానికి ఫైన్ చెల్లించాలి.
* పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఏటా కనీసం ₹500 డిపాజిట్ చేయాలి. లేదంటే ₹50 జరిమానా.
* సుకన్య సమృద్ధి యోజన యాక్టివ్గా ఉండాలంటే ₹250 డిపాజిట్ చేయాలి. లేదంటే ₹50 ఫైన్.
* నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఏటా ₹1,000 డిపాజిట్ చేయాలి. లేదంటే ₹100 పెనాల్టీ.


