News April 14, 2024
గుడ్న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ

బీజేపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రధాని మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్లో భాగంగా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ముద్ర యోజన కింద లోన్ల పరిమితి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు చెప్పారు. పేదలకు మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామని, భవిష్యత్తులో పైప్లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేస్తామని మోదీ ప్రకటించారు.
Similar News
News March 11, 2026
ఆ మందులతో లివర్ డ్యామేజీ: అధ్యయనం

ఆయుర్వేదం, ఇతర ప్రత్యామ్నాయ మందుల వాడకంపై తాజా అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడించింది. 386 రకాల ఉత్పత్తులను పరీక్షించగా 27.7% మందుల్లో స్టెరాయిడ్స్, 31.3% ఉత్పత్తుల్లో జంతు సంబంధిత వ్యర్థాలు ఉన్నట్లు ఇందులో తేలినట్లు ‘ఫ్రాంటియర్స్ ఇన్ గ్యాస్ట్రోఎంటరాలజీ’ ప్రచురించింది. వీటిలో సీసం, ఆర్సెనిక్ వంటి భార లోహాలు మోతాదుకు మించి ఉన్నాయని, వీటివల్ల 39% మందిలో కాలేయం పాడై మరణ ముప్పు పెరుగుతుందని తెలిపింది.
News March 11, 2026
ట్రంప్ రిఫైనరీ ప్రాజెక్టుకు రిలయన్సే ఎందుకు?

టెక్సాస్ రిఫైనరీ ప్రాజెక్టులో <<19350969>>రిలయన్స్<<>>ను పార్ట్నర్గా చేర్చుకోవడానికి కారణం దాని ‘నెల్సన్ కాంప్లెక్సిటీ ఇండెక్స్’ (NCI). ప్రపంచంలో అధిక NCI (21.1) ఉన్న రిఫైనరీ జామ్నగర్. అంటే ఇది చౌకగా లభించే భారీ ముడి చమురును సైతం అత్యంత నాణ్యమైన ఇంధనంగా మార్చగలదు. ఈ స్థాయి సామర్థ్యం వరల్డ్లో మరే రిఫైనరీకి లేదు. వెనిజులా నుంచి వచ్చే చమురును శుద్ధి చేయడానికి రిలయన్స్ వంటి కాంప్లెక్స్ రిఫైనరీ అవసరం.
News March 11, 2026
ఇండియాకు వస్తున్న షిప్పై ఇరాన్ దాడి!

గుజరాత్కు వస్తున్న థాయిలాండ్ కార్గో షిప్ ‘మయూరీ నారీ’పై ఇరాన్ దాడికి దిగింది. UAEలోని ఖలీఫా పోర్టు నుంచి బయల్దేరిన కాసేపటికే హార్ముజ్ జలసంధి వద్ద అటాక్ చేసింది. ఇది తమ పనేనని తాజాగా ధ్రువీకరించింది. అందులోని 20 మంది సిబ్బందిని కాపాడగా, ముగ్గురు మిస్ అయ్యారు. ప్రేషియస్ షిప్పింగ్ కంపెనీకి చెందిన ఈ నౌక కండ్లా పోర్టు(గుజరాత్)కు వస్తోంది.


