News April 14, 2024
వైసీపీ పథకాల వెనుక కుంభకోణం: చంద్రబాబు

AP: జగన్ తెచ్చిన ప్రతి పథకం వెనుక కుంభకోణం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తాను వస్తే పరిశ్రమలు వస్తాయని.. జగన్ వస్తే గంజాయి వస్తుందని అన్నారు. జగన్ ప్రభుత్వంలో తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు. తన ప్రభుత్వంలో సంపద సృష్టించి ప్రజలకు పంచుతామని తెలిపారు. కేంద్రం సాయంతో ఆకాశమే హద్దుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
Similar News
News March 10, 2026
రణ్వీర్ అప్కమింగ్ మూవీపై క్రేజీ అప్డేట్!

‘ధురంధర్-2’పై భారీ అంచనాలు నెలకొన్న వేళ రణ్వీర్ సింగ్ నెక్స్ట్ మూవీపై ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. రణ్వీర్ ఈసారి ‘ప్రళయ్’ పేరుతో ఓ జాంబీ థ్రిల్లర్లో నటించనున్నారు. ఇలాంటి సినిమాను భారత్లో ఎవరూ తీయలేదని.. కనీవినీ ఎరుగని రేంజ్లో ఉంటుందని డైరెక్టర్ జై మెహతా చెప్పడంతో అంచనాలు పెరిగాయి. రణ్వీర్ సొంత బ్యానర్లో నిర్మిస్తున్న ఈ ఫిల్మ్లో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటించనున్నట్లు తెలుస్తోంది.
News March 10, 2026
తిరుమల వెళ్లేవారికి బిగ్ అలర్ట్

సర్వదర్శనం టోకెన్లు, రూ.300 టికెట్ కలిగిన భక్తులను స్లాట్ కేటాయించిన సమయంలోనే క్యూ లైన్లలోకి అనుమతిస్తామని టీటీడీ తెలిపింది. ముందు లేదా ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వచ్చే సోమవారం నుంచి దీన్ని కఠినంగా అమలు చేస్తామని, భక్తులు గమనించి సహకరించాలని కోరింది. గంటల తరబడి క్యూ లైన్లలో భక్తుల ఇబ్బందులను తప్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు TTD వెల్లడించింది.
News March 10, 2026
గాయపడ్డ మొజ్తబా ఖమేనీ?

ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ గాయపడినట్లు వార్తలొస్తున్నాయి. ఆ దేశ TV ఛానల్ ఒకటి ఆయనను ‘జాన్బాజ్ ఆఫ్ రంజాన్’(గాయపడ్డ యుద్ధ వీరుడు) అని సంబోధించడమే ఈ వార్తలకు కారణమని India Today తెలిపింది. మొజ్తబా ఎన్నికను ట్రంప్ ఇప్పటికే వ్యతిరేకించారు. దీంతో US-ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్కు గాయాలయ్యాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా దాడుల్లో ఇప్పటికే అలీ ఖమేనీ, కుటుంబం మృతి చెందింది.


