News April 18, 2024

జువైనల్ హోం నుంచి 8మంది పరారీ

image

TG: మేడ్చల్ జిల్లా గాజులరామారంలో జువైనల్ హోం నుంచి 8మంది పరారు కావడం సంచలనంగా మారింది. వివిధ నేరాల్లో ప్రమేయమున్న 32మంది బాలురు ఈ హోంలో ఆశ్రయం పొందుతున్నారు. కాగా.. మధ్యాహ్నం పాలు తాగే సమయంలో గందరగోళం సృష్టించారు. ఒకరు కాపలాదారుడిని తోసుకొని పారిపోగా.. మరో 7మంది తరగతిలోని గ్రిల్స్ తొలగించి పరారయ్యారు. అక్కడి సిబ్బంది సస్పెండ్ అయ్యారు.

Similar News

News March 11, 2026

గ్యాస్ కొరత.. హోటళ్లకు 2 రోజుల్లో ₹20 కోట్ల నష్టం

image

TG: రాష్ట్రంలో హోటళ్లపై గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని 50 వేల హోటళ్లుండగా రోజూ ₹300 కోట్ల టర్నోవర్ జరుగుతుండగా, 2 రోజుల్లో ₹20 కోట్ల నష్టం జరిగింది. ఇక స్టాక్ సిలిండర్లు 2-3 రోజులకే ఉండటంతో ఈ నష్టం భారీగా పెరగనుందని హోటల్ యాజమాన్యాల ప్రతినిధి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే వాణిజ్య గ్యాస్ సమస్య పరిష్కారం కోసం కేంద్రంతో మంత్రి ఉత్తమ్ చర్చిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News March 11, 2026

ప్రియుడితో పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా!

image

కుంభమేళాతో పాపులరైన మోనాలిసా కేరళం పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమయ్యారు. తనకు, ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌కు రక్షణ కల్పించాలని తిరువనంతపురంలోని థంపనూర్‌ పోలీసులను ఆశ్రయించారు. తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించలేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె పేరెంట్స్‌ను పిలిచి పోలీసులు నచ్చజెప్పారు. తర్వాత తన ప్రియుడితో మోనాలిసా వెళ్లిపోయారని తెలిపారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఫర్మాన్‌తో ఆమె ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్నారు.

News March 11, 2026

గ్యాస్ కొరత.. కాంగ్రెస్ Vs బీజేపీ

image

గ్యాస్ కొరతపై కాంగ్రెస్, BJP మధ్య ట్వీట్ల వార్ సాగుతోంది. ATMల ముందు(నోట్ల రద్దు), ఆక్సిజన్(కరోనా) కోసం, ఇప్పుడు గ్యాస్ కోసం జనం క్యూలో ఉన్నారని ఫొటోను INC షేర్ చేసింది. దీంతో ప్రపంచ సంక్షోభాన్ని మోదీకి ముడిపెట్టినా కాంగ్రెస్‌కు ఎవరూ ఓటేయరని BJP సపోర్టర్లు కౌంటరిస్తున్నారు. మోదీ అభివృద్ధిని ప్రస్తావిస్తున్నారు. 8PM తర్వాత పెట్రోల్ పంపులు మూసేయాలని కాంగ్రెస్ గతంలో చెప్పిందని గుర్తుచేస్తున్నారు.