News April 21, 2024
భారత బానిసల పునాదులపై యేల్ వర్సిటీ!

పురాతన విద్యాసంస్థల్లో యేల్ యూనివర్సిటీ(US) ఒకటి. దీనికి, భారత్కు ఓ సంబంధం ఉంది. 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ ఎలిహు యేల్. మద్రాస్లో 30+ ఏళ్లు ఉన్న ఇతను కొన్ని వేల మంది భారతీయులను బానిసలుగా మార్చి ఎగుమతి చేశాడు. లండన్ వెళ్లిన తర్వాత ఓ US కాలేజీకి డొనేషన్లు ఇచ్చాడు. దీంతో అతని పేరునే దానికి పెట్టారు. కాగా బానిసత్వంతో తమకు సంబంధాలు ఉన్నందుకు ఆ వర్సిటీ ఫిబ్రవరిలో క్షమాపణ చెప్పింది.
Similar News
News March 25, 2026
LPG వెయిటింగ్ పీరియడ్లో మార్పు లేదు: కేంద్రం

వంట గ్యాస్ సిలిండర్ల వెయిటింగ్ పీరియడ్లో ఎలాంటి మార్పు లేదని కేంద్రం స్పష్టం చేసింది. గడువు యథావిధిగా పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజులుగానే కొనసాగుతోందని తెలిపింది. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. కాగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కనెక్షన్లకు 45 రోజులకు.. నాన్ PMUYలో సింగిల్ సిలిండర్ కనెక్షన్లకు 25రోజులు, డబుల్కు 35రోజులకు గడువు పెంచినట్లు ప్రచారం జరుగుతోంది.
News March 25, 2026
రాత్రిపూట ఎంగిలి పాత్రలను శుభ్రం చేయకుండా వదిలేస్తున్నారా?

రాత్రి భోజనం తర్వాత అంట్లు తోమకుండా వంటగదిలో అలాగే వదిలేయడం వాస్తు రీత్యా చాలా అశుభం. ఉదయం లేవగానే మురికి పాత్రలను చూడటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. తద్వారా దరిద్రం, పేదరికం రావొచ్చని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. ఎంగిలి పాత్రల వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదు. అందుకే వీలైనంత వరకు రాత్రే వంటగదిని, పాత్రలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత, సంపద పెరుగుతాయి
News March 25, 2026
ముందే ముగియనున్న పార్లమెంటు సమావేశాలు!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు గడువుకన్నా ముందే ముగిసే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార, విపక్ష నేతలు నిమగ్నమవ్వడమే దీనికి కారణం. నిన్న జరిగిన BAC భేటీలో దీనిపై చర్చ జరగ్గా సభను పూర్తిగా ముగించేందుకు ప్రభుత్వం సుముఖత చూపలేదు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ వంటి కీలక బిల్లులు పెండింగ్లో ఉన్నందున సభను వాయిదా వేసి ఎన్నికల తర్వాత తిరిగి నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం.


