News April 22, 2024

కవిత బెయిల్ పిటిషన్ల‌పై నేడు విచారణ

image

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ల‌పై ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. లిక్కర్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ కవితను అరెస్ట్ చేశాయి. దీంతో ఆమె 2 బెయిల్ పిటిషన్లు వేశారు. ఈనెల 16నే విచారణ జరగాల్సి ఉండగా జడ్జి సెలవులో ఉండటంతో నేటికి వాయిదా పడింది. మ.2 గం.కు వాదనలు ప్రారంభం కానున్నాయి. అటు కవిత ఈడీ, సీబీఐ జుడీషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. ఆమెను మంగళవారం కోర్టులో హాజరుపర్చనున్నారు.

Similar News

News March 19, 2026

ఇరాన్ అటాక్‌తో ఖతర్‌కు ₹9.3లక్షల కోట్ల నష్టం!

image

ఇరాన్ చేసిన దాడులతో ఖతర్‌ ఏటా $20 బిలియన్ల (₹1.86లక్షల కోట్లు) వార్షిక ఆదాయం కోల్పోయిందని ఖతర్ ఎనర్జీ సీఈవో వెల్లడించారు. దీని ప్రభావం ఐదేళ్ల పాటు ఉండి.. మొత్తం ₹9.3లక్షల కోట్ల ఆదాయం కోల్పోయామన్నారు. ఈ దాడులతో ఖతార్ LNG ఎగుమతి సామర్థ్యం 17% తగ్గిందని.. ఏటా 12.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి తగ్గనుందని తెలిపారు. దీంతో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్న దేశాలకు LNG సరఫరా సవాల్‌గా మారిందన్నారు.

News March 19, 2026

అదృష్టం తెచ్చిన కూతురు..

image

‘ధురంధర్’తో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ స్టార్‌డమ్ అమాంతం పెరిగింది. కొవిడ్ తర్వాత ఆయన తీసిన చిత్రాలు ఏవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయాయి. 2022లో జయేశ్‌భాయ్ జోర్దార్, సర్కస్, 2023లో రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. 2024లో రణ్‌వీర్, దీపికా పదుకొణె దంపతులకు పాప జన్మించింది. 2025లో డైరెక్టర్ ఆదిత్య ధర్ ‘ధురంధర్’ ప్రాజెక్టు రావడంతో రణ్‌వీర్ బ్లాక్‌బస్టర్ కొట్టారు.

News March 19, 2026

ఎల్లుండి రంజాన్.. రేపు సెలవు లేదు

image

AP: రేపు (మార్చి 20) ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సాధారణ పని దినం కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. <<19427809>>రంజాన్<<>> మార్చి 21న జరుపుకోవాలని మతపెద్దలు సూచించడంతో సెలవును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. శనివారం (మార్చి 21) పబ్లిక్ హాలిడే ఉంటుందని పేర్కొంది. అయితే శనివారం జరగాల్సిన పదోతరగతి ఇంగ్లిష్ ఎగ్జామ్ నిర్వహణపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.